Shobha Shetty:ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు పాపులారిటీ ఉంటే చాలు అవకాశాలు లేకపోయినా ఆర్థికంగా ఎదుగుతున్నారు అనడానికి కొంతమంది బుల్లితెర నటీమణులు ఉదాహరణగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు సీరియల్స్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన ప్రముఖ బ్యూటీ శోభాశెట్టి ప్రస్తుతం ఎలాంటి సీరియల్స్ చేయకపోయినా.. లక్షల్లో సంపాదిస్తూ తన ఆర్థిక స్థితిగతులను మార్చుకుంది.. మరి యూట్యూబ్ ద్వారా శోభా శెట్టి సంపాదిస్తున్న ఆదాయం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారుతోంది.
అసలు విషయంలోకి వెళ్తే… కార్తీకదీపం సీరియల్ తో మోనిత పాత్రతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది శోభా శెట్టి . ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసి.. విజేతగా నిలవకపోయినా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే కొంతమేర నెగటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్తీకదీపం 2 నుంచి ఈమెను తప్పించారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 11 కన్నడలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించక హోస్ట్ కిచ్చా సుదీప్ ను బ్రతిమలాడి మరీ బయటకు వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం మరే సీరియల్ లో కనిపించడం లేదు.
అయితే సీరియల్స్ చేయకపోయినా. అప్పుడప్పుడు టీవీ షోలు , ప్రోగ్రాంలలో సందడి చేస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ తో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమెకు భారీగా ఆదాయం వస్తుందని సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. యూట్యూబ్ ఛానల్ కు సుమారుగా 7.07 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో పర్సనల్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటూ ఉంటుంది. ఆ వీడియోలకి అటు యూట్యూబ్లో మంచి ఆదరణ కూడా లభిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఒక్కో వీడియో కి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి . వీటి ద్వారా నెలకు సుమారుగా 10 లక్షల వరకు ఆదాయం వస్తోందని సమాచారం. ఒక సీరియల్ లో నటించినా సరే ఇంత ఆదాయం రాదని , ఈమెకు యూట్యూబ్ మంచి ఆదాయ వనరుగా మారిందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా మరొకవైపు ఈమె డిజైనర్ స్టూడియోని ప్రారంభించింది. ఈ స్టూడియో ద్వారా కూడా శోభా శెట్టి భారీగా సంపాదిస్తోంది. అలాగే పలు జువెలరీ బ్రాండ్లకు ప్రమోటర్ గా కూడా మారింది శోభాశెట్టి.
ALSO READ:Pradeep Ranganathan: పెళ్లి ఎవర్ని చేసుకోవాలో కూడా ఏఐ చెబుతుందేమో -ప్రదీప్!
శోభా శెట్టి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. కార్తీక దీపం సీరియల్ లో తనతో పాటు నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్న ఈమె.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇక ఎంగేజ్మెంట్ జరిగి రెండు సంవత్సరాలుగా పైగానే అవుతున్నా ఇప్పటికీ వివాహానికి దూరంగానే ఉండడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరి ఈ ప్రేమ జంట ఎప్పుడు తమ పెళ్లి తేదీని బయటపెడతారో చూడాలి.