Rashmi Gautam: చదువు పూర్తిచేసుకుని కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే.. మరి కొంతమంది చదువును మధ్యలో ఆపేసి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు తమకంటే ఒక సంపాదన అనేది చాలా ముఖ్యం. అందుకే ఇండస్ట్రీలోకి రాకముందే పలువురు సెలబ్రిటీలు పలానా పనిచేసే ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్పుకొచ్చిన వాళ్లు కూడా లేకపోలేదు. ఇక అలాంటివారిలో తానేమి అతీతం కాదు అని చెబుతోంది రష్మీ గౌతమ్ (Rashmi Gautam). తాను కూడా ఇండస్ట్రీలోకి రాకముందు అలాంటి వ్యాపారం చేసి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను అని చెప్పుకొచ్చింది.
మార్చి 15 ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో రష్మీ గౌతమ్ తన మొదటి సంపాదన గురించి చెప్పుకొచ్చింది. రష్మీ గౌతమ్ షోలో ఉండే కంటెస్టెంట్ ల గురించి అడుగుతూ వారి ఫస్ట్ రెమ్యూనరేషన్ డీటెయిల్స్ అడుగుతూనే.. తన గురించి ఆమె తెలిపింది. రష్మీ గౌతమ్ మాట్లాడుతూ..” నేను ఇండస్ట్రీ లోకి రాకముందు క్యాండిల్స్ చేసి అమ్మేదాన్ని. అలా అమ్మడం వల్ల నాకు వచ్చిన మొదటి సంపాదన 1200 మాత్రమే” అంటూ తన మొదటి సంపాదన.. ఇండస్ట్రీలోకి రాకముందు తాను ఏం చేశాను అన్న విషయాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే తాను కూడా క్యాండిల్స్ బిజినెస్ చేశానని చెప్పడంతో అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అంత కష్టపడి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చింది కాబట్టి.. కష్టం ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటుంది అంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.
రష్మీ గౌతమ్ విషయానికి వస్తే.. 2002లో ‘సవ్వడి’ అనే సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టింది. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన ‘హోలీ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించింది. ఆ తర్వాత ‘యువ’ అనే సీరియల్ లో నటించిన ఈమె 2017లో వచ్చిన తెలుగు చిత్రం ‘ప్రస్థానం’ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన.. ఆ తర్వాత ఒక రియాలిటీ డాన్స్ షోలో రష్మీ డాన్స్ చూసిన నటి సంగీత ‘కందెన్’ అనే సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా ఆ చిత్రంలో నర్మదా అనే ప్రధాన పాత్ర పోషించిన రష్మీ.. ఇందులో శృంగార పాత్రలో నటించి తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది.
ALSO READ:Deepika Rangaraju: రూ.20తోనే నా జీవితం మొదలు.. నవ్వించే దీపికలో ఇంత దుఃఖమా?
ఇకపోతే చాలా చిత్రాలలో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అంటూ పలు చిత్రాలు చేసింది కానీ ఏవీ కూడా ఈమెకు మంచి గుర్తింపును అందించలేదు. దాంతో బుల్లితెరకే పరిమితమైంది. జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది.