E-Paper
Advertisement

Chandrababu naidu news : చంద్రబాబుపై హత్యాయత్నం కేసు.. సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్..

Chandrababu naidu news : చంద్రబాబుపై హత్యాయత్నం కేసు.. సీబీఐ విచారణకు టీడీపీ డిమాండ్..
Advertisement
Chandrababu latest news

Chandrababu latest news(AP political news):

టీడీపీ అధినేత చంద్రబాబు పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇటీవల అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించిన సమయంలో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు గ్రామంలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనపై కురబలకోట మండలం ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చంద్రబాబుతోపాటు 20 మందిని నిందితులుగా పేర్కొన్నారు.

ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్నాథ్‌ రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు. అలాగే నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్‌, పులవర్తి నాని, గంటా నరహరి, శ్రీరాం చినబాబుపై కేసులు పెట్టారు. మొత్తం 20 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశామని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేశారు.

Advertisement

ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సమయంలో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడ్డాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చేపట్టారు. గత శుక్రవారం అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని గాలేరు-నగరి, హంద్రీ-నీవా అనుసంధానం పనులు, బి.కొత్తకోట మండలంలో హంద్రీ-నీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. ఆ తర్వాత కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మీదుగా చిత్తూరు జిల్లాకు వెళ్లారు. అయితే ఆ సమయంలో అంగళ్ల గ్రామంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి.

అంగళ్లు గ్రామ సమీపంలోకి రాగానే చంద్రబాబు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం నుంచి దిగారు. ఓపెన్‌ టాప్‌ వాహనంపైకి ఎక్కి గ్రామ కూడలి వరకు వెళ్లారు. అక్కడికి చంద్రబాబు వచ్చినప్పుడు వైసీపీ శ్రేణులు అటుగా వెళ్లకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో పలువురు గాయపడ్డారు. చంద్రబాబు అంగళ్లు గ్రామం నుంచి వెళ్లిపోయిన తర్వాత విధ్వంసకాండ కొనసాగింది. ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

అంగళ్లు ఘటనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఆ గ్రామంలో చంపాలని చూశారని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న చంద్రబాబు.. అంగళ్లు అల్లర్లపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనపై హత్యాయత్నానికి పోలీసులు సహకరించారని ఆరోపించారు.

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×