Sankranti Special Food: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అల్లుడికి మర్యాదలు ఓ రేంజ్లో ఉంటాయి. ఈ విషయంలో గోదారోళ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతిథి మర్యాదకు పెట్టింది పేరు ఉభయగోదావరి జిల్లాలు. సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడికి 158 వంటకాలతో పసందైన విందు భోజనం వడ్డించారు అత్తింటివారు. వాటిని చూసి ఆశ్చర్యపోవడం అల్లుడి వంతైంది. ఇంతకీ ఎక్కడో తెలుసా?
సంక్రాంతి పండగ అతిథి మర్యాదలు
నార్మల్గా అల్లుడు అత్తింటికి వస్తే ఆ మర్యాదలు వేరు. అలాంటి సంక్రాంతి సమయంలో చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదలు, కానుకలు, వడ్డింపులు ఆ రేంజ్లోనే ఉంటాయి. గోదారి జిల్లాలను మరిపించేలా తెనాలికి చెందిన ఓ కుటుంబం కొత్త అల్లుడికి అదిరిపోయేలా ఆతిథ్యం ఇచ్చింది. ఏకంగా 158 రకాల వంటకాలతో అదిరిపోయే విందు భోజనం ఇచ్చారు.
తెనాలికి చెందిన మురళీకృష్ణ-మాదవీలత దంపతులు. తన కూతురు మౌనికను రాజమండ్రికి చెందిన శ్రీదత్తకు వివాహం జరిపించారు. మ్యారేజ్ తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి పండగ కావడంతో అల్లుడికి కళ్లు చెదిరే విందు ఏర్పాటు రెడీ చేశారు. గోదారివాసులకు ఏ మాత్రం తీసిపోని విధంగా పసందైనవంటలు, ఫలహారాలు, పండ్లతో వడ్డించి ఆశ్చర్య పరిచారు.
కొత్త అల్లుడికి 158 వంటకాలతో పసందైన విందు
అత్తమామలు డైనింగ్ టేబుల్పై 158 రకాల వంటకాలు వడ్డించి అల్లుడ్ని ముంచెత్తారు. బూరెలు, గారెలు, బొబ్బట్లు, అరిసెలు లాంటి సంప్రదాయ పిండివంటకాలు మాత్రమే కాదు, రకాల స్వీట్లు, పచ్చళ్లు దర్శనమిచ్చాయి. వాటిని చూసి కొత్త అల్లుడు షాకయ్యాడు. మా ఆచారాలకు తగ్గట్టుగా ఏ మాత్రం తీసిపోని విధంగా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు.
ALSO READ: మకర సంక్రాంతి నేడు.. కళకళలాడుతున్న పల్లెటూర్లు
అల్లుడికి వంటకాల విషయంలో ఆ రికార్డు అలాగే ఉంది. రెండేళ్ల కిందట అనకాపల్లికి చెందిన మురళీకి ఏలూరుకి చెందిన భీమారావు-చంద్రలీల దంపతులు తమ కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత వచ్చిన తొలి సంక్రాంతికి కూతురు-అల్లుడు రావడంతో ఊహించని రీతిలో అతిథి మర్యాదులు చేశారు. ఏకంగా 379 రకాల వంటకాలు చేశారు. ఇప్పటికే ఆ రికార్డు అలాగే ఉందని కొందరు చెబుతున్నారు.