E-Paper
Advertisement

Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన వాహనం.. తెలుగు వ్యక్తి మృతి..

Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన వాహనం.. తెలుగు వ్యక్తి మృతి..

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెహ్రి జిల్లా గులార్‌ వద్ద నదిలో పర్యాటకుల వెహికిల్ బోల్తా పడింది. విరిగిపడిన కొండచరియలను తప్పించుకునే క్రమంలో ఆ వాహనం నదిలోకి దూసుకెళ్లింది.

ప్రమాదానికి గురైన వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఐదుగురిని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. గల్లంతైన మరో ఆరుగురి పర్యాటకుల కోసం గాలింపు చేపట్టారు.

ఈ వాహనంలో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు కూడా ఉన్నారు. రాజాం మండలం బొద్దాంకు చెందిన రవి రంగారావు దంపతులు హైదరాబాద్‌ నుంచి పర్యటనకు వెళ్లారని సమాచారం. వాహనం నదిలో దూసుకెళ్లిన తర్వాత రవి రంగారావు భార్యను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. అయితే రవి రంగారావు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చివరకు ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×