Guntur: ఏపీలో వైసీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ఏదో విధంగా తమ నోటికి పని చెప్పి అడ్డంగా బుక్కవుతున్నారు. సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యల కేసులో బయటపడిన ఆయన, కొత్త సమస్య మొదలైంది. తాజాగా అంబటిపై మరొక కేసు నమోదు కావడంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగింది?
వైసీపీ నేత అంబటి రాంబాబుకు మళ్లీ కష్టాలు
వైసీపీ నేతలు రూటు మార్చారు. గడిచిన రెండేళ్లు కాస్త సైలెంట్ అయిన నేతలు దూకుడు పెంచారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలతో ప్రజా సమస్యలపై ఇప్పుడిప్పుడే రోడ్డు ఎక్కుతున్నారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కష్టాలు తీరేలా కనిపించలేదు.
ఆయనపై గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది? తన ఇంటిపై దాడికి నిరసనగా దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు అంబటి రాంబాబు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది.
ఆయనపై గుంటూరు పోలీసులు కేసు నమోదు, షాకైన వైసీపీ నేతలు
అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష చేయడమే కాకుండా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. ఫలితంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
కొందరు నేతలు ఆయనకు అనుకూలంగా మాట్లాడగా, మరికొందరు ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటున్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండాలని, వైసీపీ ప్రభుత్వం మాదిరిగా చేస్తే పోలీసులు సైలెంట్గా ఉంటారని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా విషయాలు పోలీసులను మెతక వైఖరి అవలంభిస్తున్నారని హైకోర్టు చీవాట్లు పెడుతోందని గుర్తు చేస్తున్నారు.
ALSO READ: ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే?
కొందరు మాత్రం కావాలని అంబటిని టార్గెట్ చేశారని అంటున్నవాళ్లు లేకపోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంతమందిపై కేసులు నమోదు అవుతాయోనని అంటున్నారు. తాజాగా నమోదైన కేసులో అంబటి రాంబాబు ఇంకా నోరు విప్పలేదు. సోషల్మీడియాలో కూడా ఆయన స్పందించ లేదు. ఈ వ్యవహారంపై ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.