Bhogapuram Airport: క్రెడిట్ చోరీకే బ్రాండ్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తయారయ్యారని వైసీపీ ఎంపీ తనూజ రాణి అన్నారు. సీఎం చంద్రబాబు పై ఆమే ఫైర్ అయ్యారు. డాలర్లు ఉన్నాయని అందుకే మంత్రి పదవి వచ్చిందని పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. భోగాపురం పై మాట్లాడే నైతిక అర్హత మీకు లేదని అన్నారు.
భోగాపురం ఎయిర్పోర్టు పనులు మా ప్రభుత్వం చేసినప్పుడు అమెరికాలో ఉన్నారని, భోగాపురం క్రెడిట్ చోరీ చేస్తున్న టిడిపి నేతలు నెల్లూరు, కుప్పం ఎయిర్పోర్టులు ఎందుకు పూర్తి చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో భోగాపురం పైన మేము చర్చకు సిద్ధం.. మీరు రెడీగా ఉన్నారా అని సవాల్ విసిరారు. అన్ని రికార్డులతో మేము ముందుకు వస్తాం అని అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం ఏయిర్ పోర్ట్ పనులు 86% శాతం పూర్తయ్యాయని టిడిపి నేతలే అంటున్నారన్నారు.
Also Read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల..!
గతంలో సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ యోగ కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. దీనివల్ల గిరిజనులకు ఉపయోగపడింది ఏమిటి అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం కోసం గిన్నిస్ బుక్ రికార్డులని మధ్య పెడుతున్నారని అసలు కథ వేరే ఉందని ఫైర్ అయ్యారు.
Aslo Read: ప్రకాశం జిల్లాలో దారుణం.. బల్లులు పడిన జావ తాగిన విద్యార్థులు