School Meal: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రకాషం జిల్లా కొండపి మండలం దేవిరెడ్డి పాలెంలో స్కూలు పిల్లకు పెనుప్రమాదం తప్పింది. ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్ధులకు రాగి జావ ఇచ్చారు. దీంతో దాదాపుగా పది మంది పిల్లలకు పోసిన తరువాత జావలో చనిపోయిన బల్లులు కనిపించాయి. అప్పటికే 10మంది విద్యార్థులకు జావ పోసినట్టు అక్కడి ఉపాధ్యాయులు గమనించారు.
దీంతో వెంటనే అప్రమత్తమై టీచర్లు విద్యార్ధుల చేత ఉప్పునీటితో నోరు శుభ్రం చేయించారు. అనంతరం వెంటనే వారిని కొండపి వైద్యశాలకు తరలించారు. దీంతో పిల్లలకు వెంటనే చికిత్స అందించి 5గురు పిల్లలను వైద్యులు డిచార్జ్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పనట్టైంది. మరో 5గురు పిల్లలకను సిబ్బంది అబ్జర్వేషన్లో ఉంచినట్టు అక్కడి వైద్యులు తెలిపారు.
Also Read: కేసీఆర్కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!
ప్రమాదానికి గురైన విద్యార్ధులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. పాఠశాలలో మొత్తం 27 మంది విద్యార్ధులు వంట చేసే వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇ ప్రమాదం జరిగిదని పిల్లల తల్లిదండ్రులు ఫైర్ అయ్యారు. స్కూలు సిబ్బంది పై విద్యార్ధి సంఘాలు, వివిధ నాకులు ఫైర్ అయ్యారు. ఏదైన జరిగితే వాల్ల పరిస్ధితి ఎంటని యాజమాన్యంపై తల్లితండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బావిలో దొరికిన మహిళ శవం… దర్యాప్తులో బయటపడిన భయంకర రహస్యం