TTD Brahmotsavam: తిరుమల దేవస్థానంలో ఈ ఏడాదికి సాలకట్ల బ్రంహోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సంస్ధ ఏర్పాట్లను ప్రారంభించింది. అందుకుగాను టీటీటీడీ వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23 తేది వరకు అనగా వరుసగా తొమ్మిది రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్బంగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకంది.
అయితే స్వామి వారి మూలవిరాట్టుతో పాటుగా వాహన సేవలను చూసేందుకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. దీంతొ సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తోమ్మిది రోజుల పాటు ఈ క్రింద తెలిపిన దర్షానాలను మరియు సేవలను నిలిపివేయనుంది.
Also read: ఎల్లంపేట్ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!
రద్దు చేసిన ఆర్జిత సేవల్లో అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, స్వామి వారి కల్యాణోత్సవం, మరియు ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను నిలిపివేయనుంది. భక్తుల సౌకర్యార్ధం ఈ నిర్నయం తీసకున్నట్టు టీటీడీ అధికారుల తెలిపారు. వీటితో పాటుగా ప్రతిరోజు రిజిస్టర్ అయ్యే ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసింది. వృద్ధుల దర్శనం, దివ్యాంగుల దర్శనం, చంటిపిల్లల తల్లిదండ్రుల దర్శనం, మరియు ఎన్ఆర్ఐ దర్శనంతో పాటుగా దాతల దర్శనాలను కూడా నిలిపివేయనున్నట్టు టీటీడీ అధికారుల తెలిపారు.
Also Read: నన్ను వాడుకుని వదిలేశారు.. వైఎస్ జగన్ నివాసం వద్ద బోరగడ్డ అనిల్ హల్చల్!