E-Paper
Advertisement

Anakapally District: బూతులు తిడుతున్నారు.. నారా లోకేష్‌కు హాస్టల్ విద్యార్థినీల వేడుకోలు, స్పందిస్తారా?

Anakapally District: బూతులు తిడుతున్నారు.. నారా లోకేష్‌కు హాస్టల్ విద్యార్థినీల వేడుకోలు, స్పందిస్తారా?
Advertisement

Anakapally District: అనకాపల్లి జిల్లా చీడికాడలోని బీసీ బాలికల వసతి గృహంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వసతి గృహంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు కావాల్సిన మెనూ కేవలం కాగితాలకే పరిమితమైందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందకపోవడమే కాకుండా, కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టని పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. పౌష్టికాహారం అందించాల్సిన సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ప్రశ్నిస్తే వేధింపులు.. అసభ్య పదజాలం
తమకు జరుగుతున్న అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించిన విద్యార్థినులపై హాస్టల్ సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెబితే, విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలం వాడుతూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. క్రమశిక్షణ పేరుతో వారిపై అవాకులు చవాకులు పేలుతూ, చదువుకోవాల్సిన పిల్లల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారు.

Advertisement

వెట్టిచాకిరీతో ఇబ్బందులు
హాస్టల్‌లో వంట, ఇతర పనుల కోసం సిబ్బంది ఉన్నప్పటికీ, ఆదివారాలు, సెలవు దినాల్లో విద్యార్థినులతో ఇతర పనులు చేయిస్తున్నట్లు సమాచారం. చదువుకోవాల్సిన సమయంలో తమను పనిమనుషులుగా వాడుకుంటున్నారని, ఇది తమ విద్యాభ్యాసాన్ని దెబ్బతీస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం పతాక స్థాయికి చేరడంతోనే వారు సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడును వెళ్లబోసుకున్నారు.

వింత శిక్షలు – అడిగితే అధికంగా పెట్టి వేధింపులు
భోజనం సరిపోవడం లేదని ఎవరైనా విద్యార్థిని అడిగితే, మరుసటి రోజు ఆమెకు బలవంతంగా అతిగా ఆహారాన్ని వడ్డించి ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. ఆకలి తీర్చమని అడిగినందుకు ఇలాంటి వింత శిక్షలు వేస్తూ విద్యార్థినులను శారీరకంగా, మానసికంగా వేధించడం అక్కడి సిబ్బందికి అలవాటుగా మారిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Also Read: ముగిసిన సిలిండర్ యుగం.. మళ్లీ వచ్చిన కట్టెల కాలం

మంత్రి నారా లోకేష్‌కు విజ్ఞప్తి
ఈ అక్రమాలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని వారు తెగేసి చెబుతున్నారు. బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, హాస్టల్‌లో మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×