E-Paper
Advertisement

Chandrababu : చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట..ముగ్గురు మహిళలు మృతి..

Chandrababu : చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట..ముగ్గురు మహిళలు మృతి..

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమంలో మరోసారి తొక్కిసలాట జరిగింది. గుంటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో అపశ్రుతి చోటు చేసుకుంది. సభ ముగిసి చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలిలో ఓ మహిళ మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 30వేల మందికి ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. ఆయన కార్యక్రమంలో ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా అందరూ తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. వెనుక ఉన్న వాళ్లు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

చంద్రన్న కానుకులు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం చేయడంతో సభకు భారీగా మహిళలు తరలివచ్చారు. కానుకల పంపిణీ సమయంలో అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇద్దరు మృతులను ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవి, ఆషియాగా గుర్తించారు.

ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్నిరోజుల వ్యవధిలోనే మరో విషాదం చోటుచేసుకోవడంపై అటు టీడీపీపైనా, ఇటు ప్రభుత్వంపైనా విమర్శలు వస్తున్నాయి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×