E-Paper
Advertisement

Lokesh Red Book: రెడ్ బుక్ అంశం.. నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు..

Lokesh Red Book: రెడ్ బుక్ అంశం.. నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు..
Advertisement

Lokesh Red Book: టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ లో లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఐడీ పోలీసులు నారా లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. లోకేష్ కూడా తనకు నోటీసులు అందినట్టు రిప్లై ఇచ్చారు.

కాగా ఈ పిటిషన్ పై గురువారం నాడు ఏసీబీ కోర్టులో.. సీఐడీ వాదనలు వినిపించింది. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం.. ఆ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో వ్యాఖ్యానించినట్లు సీఐడి కోర్టుకు వివరించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కి కోర్టు వాయిదా వేసింది.

Advertisement

ఈ క్రమంలోనే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని.. సీఐడీ.. న్యాయస్థానాన్ని కోరింది. దీంతో ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. లోకేష్ ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని.. ఆ నోటీసుల్లో వెల్లడించింది.

అయితే ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల మేరకు లోకేశ్‌కు నోటీసులు అందించేందుకు.. సీఐడీ అధికారులు తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి గురువారం సాయంత్రం వెళ్లారు. కానీ ఆ సమయంలో లోకేశ్‌ అందుబాటులో లేకపోవడంతో సీఐడీ అధికారులు నోటీసులు అందించకుండానే వెనుదిరిగారు. కోర్టు అనుమతితో ఈరోజు లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×