BigTV English
Advertisement

Lokesh Red Book: రెడ్ బుక్ అంశం.. నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు..

Lokesh Red Book: రెడ్ బుక్ అంశం.. నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు..

Lokesh Red Book: టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. రెడ్‌బుక్ పేరుతో నారా లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ లో లోకేష్ కు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఐడీ పోలీసులు నారా లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపారు. లోకేష్ కూడా తనకు నోటీసులు అందినట్టు రిప్లై ఇచ్చారు.


కాగా ఈ పిటిషన్ పై గురువారం నాడు ఏసీబీ కోర్టులో.. సీఐడీ వాదనలు వినిపించింది. గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం.. ఆ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ లలో వ్యాఖ్యానించినట్లు సీఐడి కోర్టుకు వివరించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కి కోర్టు వాయిదా వేసింది.

ఈ క్రమంలోనే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని.. సీఐడీ.. న్యాయస్థానాన్ని కోరింది. దీంతో ఈ అంశంలో లోకేశ్‌కు నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. లోకేష్ ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని.. ఆ నోటీసుల్లో వెల్లడించింది.


అయితే ఏసీబీ న్యాయస్థానం ఆదేశాల మేరకు లోకేశ్‌కు నోటీసులు అందించేందుకు.. సీఐడీ అధికారులు తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి గురువారం సాయంత్రం వెళ్లారు. కానీ ఆ సమయంలో లోకేశ్‌ అందుబాటులో లేకపోవడంతో సీఐడీ అధికారులు నోటీసులు అందించకుండానే వెనుదిరిగారు. కోర్టు అనుమతితో ఈరోజు లోకేష్‌కు వాట్సాప్‌లో నోటీసులు పంపారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×