E-Paper
Advertisement

Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గాజు గ్లాస్ డైలాగ్.. ఈసీ రియాక్షన్..

Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో గాజు గ్లాస్ డైలాగ్.. ఈసీ రియాక్షన్..
Advertisement

Ustad Bhagat Singh TeaserAP CEO Reaction on Ustaad Bhagat singh Teaser (Andhra news updates): జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృదం మంగళవారం విడుదల చేసింది. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ గాజు గ్లాసుకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ చెప్పారు. ఈ టీజర్ ద్వారా పవన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ ప్రచారం జరగడంతో ఈసీ దీనిపై స్పందించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని టీజర్ మంగళవారం విడుదలైంది. అయితే ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గాజు గ్లాసును చూపిస్తు చెప్పిన డైలాగ్స్ పై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా స్పందించారు. బుధవారం ముకేష్ కుమార్ మీనా నిర్వహించిన మీడియా సమావేశంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తానింకా టీజర్ చూడలేదని.. చూసిన తర్వత దీనిపై స్పందిస్తామన్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఎటువంటి పర్మిషన్ తీసుకోలేదని.. ఇది పొలిటికల్ యాడ్ అయితే మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి భగత్స్ బ్లేజ్ పేరుతో మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ విడియోలో విలన్ పవన్ కళ్యాణ్ ను చూస్తు.. ఇది నీ రేంజ్ అంటూ గాజు గ్లాసును కిందపడేస్తాడు. ఆ తర్వాత గాజు గ్లాసు ముక్కలను చేతిలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్.. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది.. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అంటూ పవన్ పోలీస్ పాత్రలో విలన్ తో మాస్ డైలాగ్ చెప్తాడు. ప్రస్తతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మెగిన నేపథ్యంలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును వినియోగించి డైలాగ్స్ చెప్పడంపై రాజకీయంగా చర్చ మొదలైంది.

Also Read: AP Elections: ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. వాలంటీర్లపై వేటు..

Advertisement

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ పై ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా స్పందించారు. తాను ఇంకా టీజర్ చూడదేన్నారు. అంతవరకు తాను ఏమీ మాట్లాడలేన్నారు. అయితే గ్లాస్ చూపించి పబ్లిషిటీ చేస్తే పొలిటికల్ యాడ్ కిందకు వస్తుందన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రకటనలు చేయడం తప్పుకాదని.. అలా చేయాలంటే తప్పనిసరిగా ఈసీ పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఈ టీజర్ ఓ పొలిటికల్ యాడ్ అయితే తప్పకుండా వారికి నోటీసులు అందిస్తామన్నారు. ఆ తర్వాత వారు రీసర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ టీజర్ పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలిస్తామని తెలియజేశారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×