BigTV English
Advertisement

CS Neerabh Kumar Prasad: సీఎస్ నీరభ్ కుమార్ పదవీకాలం పొడిగింపు.. డీఓపీటీ ఉత్తర్వులు జారీ..!

CS Neerabh Kumar Prasad: సీఎస్ నీరభ్ కుమార్ పదవీకాలం పొడిగింపు.. డీఓపీటీ ఉత్తర్వులు జారీ..!

AP CS Neerabh Kumar Prasad Service Extended: ఏపీ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్రప్రభుత్వం పొడిగించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు నీరభ్ కుమార్. ఆయన పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనుండటంతో.. పదవీకాలాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఏపీ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు.. సీఎస్ గా నీరభ్ కుమార్ పదవీకాలాన్ని పొడిగిస్తూ.. డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.


జూన్ 16న ఏపీ ప్రభుత్వం నీరభ్ కుమార్ పదవీకాలాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తూ.. కేంద్రానికి లేఖ రాసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ 16(1) ప్రకారం.. 1987వ బ్యాచ్ కు చెందిన ఆయన పదవీకాలాన్ని 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై పంపింది. ఆయన స్థానంలో నీరభ్ కుమార్ ను నియమించారు. గతంలో ఆయన భూ పరిపాలన కమిషనర్ గా పనిచేశారు. ఏపీకి సీఎస్ గా రాకముందు వరకూ రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు.


Also Read : చీఫ్ సెక్రటరీ కాదు.. చీప్ సెక్రటరీ: సీఎస్ పై సోమిరెడ్డి ఫైర్!

కాగా.. గత ప్రభుత్వంలో నిబంధనలు ఉల్లంఘించిన కొందరు ఐఏఎస్ అధికారులపై వేటు పడింది. మరోవైపు కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న ఏపీ కేడర్ అధికారుల్ని తిరిగి రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరగా.. ఐఏఎస్ పీయూష్ కుమార్ ను పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన రాష్ట్రానికి వస్తే ఏ శాఖకు నియమిస్తారో చూడాలి.

Tags

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×