E-Paper
Advertisement

Chandrababu Serious on Minister wife Issue: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్

Chandrababu Serious on Minister wife Issue: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్
Advertisement

CM Chandrababu Serious on Minister wife Issue: ఆమె.. రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సతీమణి. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం సీఎం వరకు చేరింది. వెంటనే స్పందించిన సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ సదరు మంత్రికి సూచించారు. దీంతో ఆయన ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఇతర మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం..

ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి.. పోలీసులతో ప్రవర్తించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన విధానాన్ని తప్పుబట్టారు. మంత్రి రామ్ ప్రసాద్ తో ఫోన్ లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలన్నారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలంటూ సీఎం సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమంటూ హెచ్చరించారు.

Advertisement

Also Read: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. పోలీసుల విచారణ, త్వరలో అరెస్టులు!

పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పొరపాట్లు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. రాయచోటీలో పోలీసులు తనకు కూడా ఎస్కార్ట్ గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారంటూ ఆ వార్తా కథనాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×