E-Paper
Advertisement

AP CS : దుష్ప్రచారం తగదు..ఆ రోజు సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించలేదు: ఏపీ సీఎస్‌

AP CS : దుష్ప్రచారం తగదు..ఆ రోజు సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించలేదు: ఏపీ సీఎస్‌
Advertisement

AP CS : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే సీఎం సతీమణి భారతి వద్ద పనిచేసే నవీన్ ను సీబీఐ అధికారులు ఈ నెల 3న కడపలో విచారించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై విమర్శలు వచ్చాయి.

సీఎస్ వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 3న కడప కేంద్ర కారాగారం మీదుగా వెళ్తూ ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు వెళ్లారని… అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఖండించారు.

Advertisement

సింహాద్రిపురం మండలం అహోబిలపురం భానుకోట సోమేశ్వరాలయ మహా కుంభాభిషేకంలో పాల్గొనేందుకు ఈ నెల 2న తాను రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నానని తెలిపారు. 3వ తేదీ ఉదయం 9.50 గంటల సమయంలో వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని వివరించారు. అదేరోజు మధ్యాహ్నం ముద్దనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశమయ్యామని చెప్పారు. ఈ కార్యక్రమం ముగియగానే సాయంత్ర 4.40 గంటలకు అక్కడి నుంచి బయల్దేరానని వివరించారు. రాత్రి 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నానని తెలిపారు. కడప కలెక్టర్‌, ఇతర అధికారులు తనకు వీడ్కోలు పలికారని చెప్పారు. రాత్రి 9 గంటలకు స్పైస్‌జెట్‌ విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నానని సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు. తనపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించలేదని స్పష్టం చేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×