BigTV English

AP CS : దుష్ప్రచారం తగదు..ఆ రోజు సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించలేదు: ఏపీ సీఎస్‌

AP CS : దుష్ప్రచారం తగదు..ఆ రోజు సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించలేదు: ఏపీ సీఎస్‌

AP CS : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే సీఎం సతీమణి భారతి వద్ద పనిచేసే నవీన్ ను సీబీఐ అధికారులు ఈ నెల 3న కడపలో విచారించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై విమర్శలు వచ్చాయి.


సీఎస్ వైయస్‌ఆర్‌ జిల్లా పర్యటన సందర్భంగా ఈ నెల 3న కడప కేంద్ర కారాగారం మీదుగా వెళ్తూ ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి ఒకే వాహనంలో రేణిగుంటకు వెళ్లారని… అక్కడి నుంచి విమానంలో విజయవాడకు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఖండించారు.

సింహాద్రిపురం మండలం అహోబిలపురం భానుకోట సోమేశ్వరాలయ మహా కుంభాభిషేకంలో పాల్గొనేందుకు ఈ నెల 2న తాను రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నానని తెలిపారు. 3వ తేదీ ఉదయం 9.50 గంటల సమయంలో వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని వివరించారు. అదేరోజు మధ్యాహ్నం ముద్దనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశమయ్యామని చెప్పారు. ఈ కార్యక్రమం ముగియగానే సాయంత్ర 4.40 గంటలకు అక్కడి నుంచి బయల్దేరానని వివరించారు. రాత్రి 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నానని తెలిపారు. కడప కలెక్టర్‌, ఇతర అధికారులు తనకు వీడ్కోలు పలికారని చెప్పారు. రాత్రి 9 గంటలకు స్పైస్‌జెట్‌ విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నానని సీఎస్ జవహర్ రెడ్డి వివరించారు. తనపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించలేదని స్పష్టం చేశారు.


Related News

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Big Stories

×