E-Paper
Advertisement

AP Elections 2024: ఉత్తరాంధ్ర వైసీపీలో కుదుపులు.. ఎమ్మెల్యేలకు ఎంపీలు, ఎంపీలకు ఎమ్మెల్యేలు

AP Elections 2024: ఉత్తరాంధ్ర వైసీపీలో కుదుపులు.. ఎమ్మెల్యేలకు ఎంపీలు, ఎంపీలకు ఎమ్మెల్యేలు
Advertisement

AP Elections 2024: ఉత్తరాంధ్రలో వైసీపీలో కుదుపులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గల్లో కొత్త వాళ్లకు అవకాశలు ఇస్తున్న సీఎం జగన్.. కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా మారుస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా నుండి ఎమ్మెల్సీగా ఉన్నా దువ్వాడ శ్రీనివాస్‌ను శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయించాలని సీఎం ఆలోచన చేస్తున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఓడించాడానికి బలమైన అభ్యర్థిగా దువ్వాడను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నేతలుగా ఉన్న ధర్మాన అన్నదమ్ములను కూడా మార్చనున్నట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి కృష్ణ దాస్ కూడా శ్రీకాకుళం ఎంపీగా బరిలోకి దింపాలనే ప్లాన్‌లో జగన్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణ దాస్ కొడుకు చైతన్యకు అవకాశం ఇస్తారని సమాచారం అందుతోంది. ఇచ్ఛాపురంలో టీడీపీకి బలమైన అభ్యర్థి ఉండటంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థిని మార్చనున్నారు. ఆ స్థానంలో జడ్పీ ఛైర్మెన్ ధనలక్ష్మిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం చూస్తుంది. శ్రీకాకుళం సీటుని ధర్మాన ప్రసాదరావు కొడుకు రామ్ మనోహర నాయుడికి ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే అందుకు సీఎం ఒప్పుకోవడం లేదు. ధర్మాన ప్రసాదరావే పోటీ చేయాలని చెబుతున్నారట.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×