AP Revenue Department: కొత్త ఏడాది-2026ను పురస్కరించుకుని ఏపీ ప్రజలకు రెవెన్యూ శాఖ శుభవార్త అందించింది. న్యూఇయర్ గిప్ట్గా భూ యజమానులకు భారీ ఊరటనిచ్చింది. 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంతకం చేశారు. ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తూ కొత్త ఏడాదిలో తొలి సంతకం చేశారు ఆయన. మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలోజీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తూ చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదే శాలు జారీ చేసింది. అలాగే స్వాతంత్ర్య సమర యోధుల భూములను, రాజకీయ బాధితులకు కేటాయించిన భూముల ను కూడా 22ఏ నుండి తొలగించనున్నారు.