BigTV English

Central Ministers Departments: మోదీ టీంలో ఏపీ నుండి ముగ్గురు.. మంత్రులకు ఇచ్చేది ఈ శాఖలేనా..?

Central Ministers Departments: మోదీ టీంలో ఏపీ నుండి ముగ్గురు.. మంత్రులకు ఇచ్చేది ఈ శాఖలేనా..?

Central Ministers from Andhra Pradesh: నిన్న ఢిల్లీలో మోడీ మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. మోడీ టీంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. రెండు క్యాబినెట్ మంత్రులు, మూడు సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించారు. ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ.. తెలంగాణ నుంచి బండి సంజయ్ సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.


కీలక శాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా ఈ శాఖ తమకు కావాలని అడినట్టు తెలుస్తోంది. అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి, అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేసే వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.

Also Read: చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునుంచేనా ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు..?


ఇక.. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు వాటర్ రిసోర్స్ సహాయ మంత్రిత్వ శాఖ కేటాయించనున్నారు. వాటర్ రిసోర్స్ సహాయ మంత్రిత్వ శాఖ సాయంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయొచ్చని టీడీపీ అధినేత భావిస్తున్నారు. నరసాపురం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే బీజేపీ అధిష్టానం ఆయనకు ఈ శాఖను కేటాయించినట్టు తెలుస్తోంది.

Tags

Related News

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Big Stories

×