Wife and Husband Incident: దారుణం.. వివాహేతర సంబంధాలు అనేక దారుణాలకు పాల్పడుతున్నాయి. పెళ్లి అయ్యాక ప్రేమించడం.. అడ్డుగా ఉన్నాడని భర్తను లేపేయడం ఇదే పనిగా అవుతున్నాయి ఈ మధ్య.. ఇప్పుడు కూడా ప్రియుడి కోసం భర్తపై వేడి నూనె పోసి హత్యయాత్నానికి పాల్పడింది ఓ భార్య..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో శనివారం దారుణ ఘటన జరిగింది. అయితే పలమనేరు మండలంలోని కోతిగుట్ట గ్రామానికి చెందిన సి. వెంకటేశులు ఆర్మీలో డ్యూటీ చేస్తున్నాడు. ఆయన భార్య శిల్ప.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త ఆర్మీకి వెళ్లడంతో వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత శిల్పకు వెంకటేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధం గత ఏడాది నుంచి కొనసాగించుకుంటు వచ్చింది.
ఈ విషయం తెలిసిన వెంకటేశులు తన భార్యకు తీవ్రమైన గొడవలు అయ్యాయి. దీంతో భర్త తనుకు అడ్డుగా ఉన్నాడు అని చంపాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. ఇక ప్రియుడు వచ్చిన తర్వాత శిల్ప, తన ప్రియుడు వెంకటేష్ కలిసి వెంకటేశుల మీద వేడి వేడి నూనె పోసి హత్యయత్నం చేశారు. అనంతరం ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు.
Also Read: దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశులు పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అంతేకాకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. పోలీసులు ఈ కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.