E-Paper
Advertisement

Attack on CM Jagan : సీఎం జగన్ పై దాడికేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నిందితుడు?

Attack on CM Jagan : సీఎం జగన్ పై దాడికేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నిందితుడు?
Advertisement

Progress in Attack on CM Jagan Case(Andhra politics news) : సీఎం జగన్ పై దాడికేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్థానికులు తమ మొబైల్స్ లో తీసిన వీడియోల ఆధారంగా పోలీసులు ఐదుగురు అనుమానితులను గుర్తించారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఒకరు నిందితుడని భావిస్తున్నారు. ఐదుగురు యువకులను దాడి చేయడానికి గల కారణాలపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. టైల్స్ రాయి ముక్కతో జగన్ పై దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు నిందితుడిగా భావిస్తున్న యువకుడు.. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్ గా తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఆకాష్, దుర్గారావు, చిన్ని, సంతోష్ లు ఉన్నారు.

Also Read : Police Reward : రాయి దాడి కేసు.. నిందితులను పట్టిస్తే రూ.2 లక్షలు.. కానీ ?

Advertisement

శనివారం (ఏప్రిల్ 13) రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలోని సింగ్ నగర్ లో సీఎం జగన్ ప్రచారానికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ కరెంట్ పోవడం, గుర్తుతెలియని వ్యక్తులు రాయి విసరడం, జగన్ ఎడమ కంటి పైభాగాన, ఎమ్మెల్యే వెల్లంపల్లికి కంటికి గాయాలవ్వడం అంతా.. రెప్పపాటుకాలంలో జరిగిపోయాయి. ఆ వెంటనే ఇద్దరికీ వైద్యులు చికిత్స చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు జగన్ కు చికిత్స చేసి గాయమైన చోట మూడు కుట్లు వేశారు. ఆ తర్వాతి రోజు.. ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్.. నిన్నటి నుంచి మళ్లీ ప్రచారం షురూ చేశారు.

కాగా.. సీఎం ప్రచారం జరుగుతుంటే కరెంట్ ఎలా పోతుంది? ఇదంతా అధికార పార్టీ కుట్రేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే.. అదంతా సెక్యూరిటీ ప్రోటోకాల్ లో భాగంగా జరిగిందని సీపీ కాంతిరాణా తెలిపారు. ప్రచార రూట్ లో విద్యుత్ కనెక్షన్ లైన్లు, కేబుల్ లైన్లు ఎక్కువగా ఉండటంతో.. అవి రూఫ్ టాప్ కు తగిలే అవకాశం ఉంది. సీఎం భద్రత కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారాయన.

Advertisement

Tags

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×