BigTV English

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Road Accident: కొత్తసంవత్సరం అంతా బాగుండాలని, ఎలాంటి విషాదాలు వద్దని ఎంత కోరుకున్నా.. కొన్ని సంఘటనలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో.. మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎదురుగా వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.


ఎస్సై నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. పాపాయిపల్లికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ఎదురుగా గిద్దలూరు నుంచి వస్తున్న బొలెరో వాహనం బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×