E-Paper
Advertisement

BR Naidu Allegations: బీఆర్ నాయుడుపై బాధితురాలి సంచలన లేఖ.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు!

BR Naidu Allegations: బీఆర్ నాయుడుపై బాధితురాలి సంచలన లేఖ.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు!

BR Naidu Allegations: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై ఒక మహిళ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సదరు బాధితురాలు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మంత్రి నారా లోకేష్‌లకు తన ఆవేదనను వివరిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ‌ల‌ను వైకాపా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మణికొండలో నివసిస్తున్న ఆమె.. గత 25 నుండి 30 ఏళ్లుగా బీఆర్ నాయుడుతో తనకు పరిచయం ఉందని.. అది క్రమంగా సంబంధంగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో తనకు సుఖం కన్నా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులే మిగిలాయని ఆమె లేఖలో వాపోయారు.

బాధితురాలు తన లేఖలో బీఆర్ నాయుడి నైజంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను లోబర్చుకోవడమే ఆయన పని అని.. తన కోరిక తీర్చకపోతే మహిళలకు ఏ చిన్న పని కూడా చేసి పెట్టడని ఆమె ఆరోపించారు. బీఆర్ నాయుడు ఒక ఉమెనైజర్ అని.. అటువంటి వ్యక్తికి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ పదవిని కట్టబెట్టడం సరికాదని ఆమె లేఖ‌లో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇస్తే మహిళలకు మరింత ముప్పు పొంచి ఉంటుందని.. ఇది పార్టీ పరువుకు కూడా నష్టం కలిగిస్తుందని ముఖ్యమంత్రిని వేడుకున్నారు.

మరింత హృదయవిదారకమైన విషయం ఏమిటంటే.. బాధితురాలి 16 ఏళ్ల కుమార్తె ‘SLE’ (Systemic Lupus Erythematosus) అనే ప్రాణాంతక ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. కుమార్తె వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నానని.. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని బీఆర్ నాయుడు తనను మానసికంగా.. ఆర్థికంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నుండి తనపై నిఘా పెట్టి వేధిస్తున్నారని.. ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×