E-Paper
Advertisement

Amaravati: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు

Amaravati: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు
Advertisement

Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపుపై ఫోకస్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే తన కాన్వాయ్‌లోని సగానికి పైగా వాహనాలను తగ్గించుకున్న సీఎం చంద్రబాబు, తాజాగా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ విధానాన్ని పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే

Advertisement

ఇరాన్‌పై అమెరికా యుద్ధం చేయలేదు. కాకపోతే మార్చి నెలలో జరిగిన పరిణామాలు, మరోవైపు ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్భంధనం చేయడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా సూచించారు.

ముఖ్యంగా బంగారం కొనుగోలు, ఇంధనం పొదుపు, వర్క్ ఫ్రం హోమ్ విధానానికి ఆయన సూచనలు చేశారు. ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ విధానం తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీ సూచనల తర్వాత ఏపీ ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.

Advertisement

వర్క్ ఫ్రం హోమ్ విధానంపై సీఎం చంద్రబాబు కసరత్తు

వర్క్‌ ఫ్రం హోమ్ విధానాన్ని ప్రభుత్వ రంగంలో అమలు చేస్తామని చెప్పకనే చెప్పారు. కాబోయే రోజుల్లో ఇంట్లో కూర్చొని పని చేసే పరిస్థితి రానున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా మన ఆలోచనా విధానంలో మార్పు రావాలన్నారు. దీనివల్ల అనవసర ప్రయాణాలు తగ్గుతాయని, టెలి-వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం అమలు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉందంటున్నాయి. ఈ క్రమంలో ఇంటి నుంచి పని చేసేవారు.. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని రెండు వర్గాలుగా విభజించే అవకాశం ఉందంటున్నారు.

ALSO READ: కృష్ణమ్మ కంట కన్నీరు.. అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్.. తెలుగు రాష్ట్రాలకు తప్పని జలగండం?

అలా కాని పక్షంలో వర్క్ ఫ్రం హోమ్‌తో పాటు హైబ్రిడ్ విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. అంటే వారంలో మూడు రోజులు ఆఫీసు, మూడు రోజులు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని పరిశీలన చేస్తున్నారట. గురువారం జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి వెంటనే ఓ నిర్ణయం తీసుకుంటారని అంటున్నాయి.

Related News

మాజీ స్పీకర్ తమ్మినేని చుట్టూ ఉచ్చు.. సీతారాం, కుటుంబసభ్యులపై కేసు, ఏం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

Big Stories

Advertisement
×