BigTV English

Chandrababu: ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది.. ఇకమీదట అలా ఉండబోదు’

Chandrababu: ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది.. ఇకమీదట అలా ఉండబోదు’

Chandrababu Naidu new Speech(AP latest news): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్రంలో మంత్రివర్గ కూర్పు గురించి, అందులో టీడీపీకి ఉన్న ప్రాధాన్యతతోపాటు పలు అంశాలపై ఎంపీలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని ఆయన ఎంపీలకు సూచించారు.


‘ఇక మీదట మీరు మారిన చంద్రబాబును చూస్తారు. బ్యూరోక్రాట్స్ పాలన అసలే ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండబోదు. మీరే ప్రత్యేక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి నన్ను కలవండి. నేను ఎంత బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడుతాను. నా కోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి.. మీద పెట్టినా జై టీడీపీ.. జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ప్రతి అంశాన్ని నేనే వింటాను.. నేనే చూస్తాను. ఇకనుంచి రాజకీయ పాలన ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలి. అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేసుకుంటూ వెళ్లండి. ఈ ఐదేళ్లు కార్యకర్తల ఇబ్బందులు మనోవేదన కలిగించాయి. నేతలు, కార్యకర్తల కృషి వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేస్తాను. ఎంపీలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో పనిచేయాలి’ అంటూ చంద్రబాబు ఎంపీలకు సూచించారు.

Also Read: 40 మంది సలహాదారులను తొలగించిన ఏపీ ప్రభుత్వం


అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తన పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజా సేవకులుగా పోలీసులు మారాలంటూ చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఆయన వెంట టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు. శుక్రవారం ఎన్డీయే పక్షాల భేటీలో ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొననున్నారు.

Tags

Related News

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Big Stories

×