E-Paper
Advertisement

AP Government: 40 మంది సలహాదారులను తొలగించిన ఏపీ ప్రభుత్వం

AP Government: 40 మంది సలహాదారులను తొలగించిన ఏపీ ప్రభుత్వం
Advertisement

Advisors to AP Govt. Removed: ఏపీలో ఎన్నికల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నది.

కాగా, బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయనివారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 4 నుంచి తొలగింపు అమల్లోకి వస్తుందంటూ అందులో పేర్కొన్నది.

Advertisement

మంత్రుల పేషీల్లోని పీఎస్ లు, ఓఎస్డీలను మాతృశాఖకు పంపుతూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11 లోగా ఆయా మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్డీలను వారి మాతృశాఖల్లో రిపోర్టు చేయాలంటూ అందులో ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని ఫైల్స్, రికార్డులు, డ్యాక్యుమెంట్స్ ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేయాలని ఆదేశించారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను సమర్పించాలని జీఏడీ ఆదేశించింది. అలాగే పేషీలకు సంబంధించిన నో డ్యూస్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలంటూ సూచించింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్ వివరాలను సైతం ఇవ్వాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

Also Read: ‘చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది.. ఇకమీదట అలా ఉండబోదు’

Advertisement

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రవిచంద్రను నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీలో మరికొంతమంది అధికారుల నియామకంపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×