E-Paper
Advertisement

Chandrababu Kuppam Tour: టీడీపీ కంచుకోట కుప్పం.. వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం..

Chandrababu Kuppam Tour: టీడీపీ కంచుకోట కుప్పం.. వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం..

Chandrababu Kuppam Tour: కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కుప్పంలో అభివృద్ధి జరిగిందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటిస్తున్నారు. కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద ప్రజలనుంచి వినతులను స్వీకరించి.. శాంతిపురం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

టీడీపీ అధికారంలో ఉంటే కుప్పంలో హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిచేవారమని చంద్రబాబు పేర్కొన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి హంద్రీనీవా ప్రాజెక్టును 87 శాతం పూర్తి చేస్తే.. మిగతా 13 శాతం కూడా పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఇంతవరకూ.. ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని యద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతన్నలను ప్రోత్సహించేందుకు ఏ కార్యక్రమమైనా చేపట్టారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం వైసీపీ నాయకులకు లేదని, ప్రజల్ని దోచుకోవడమే వాళ్ల పని అని విమర్శించారు. ఇసుక, భూములు, మద్యం, నీళ్లపై వీళ్ల కన్ను పడితే మటాష్ అయిపోతాయన్నారు. వైసీపీ నేతలంతా దొంగలు, గజదొంగలని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచుకున్న డబ్బంతా కక్కిస్తానన్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×