![Chandrababu](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/03/cbn-1-2.jpg)
Chandrababu: తిరుపతి జిల్లాలోని నాయుడు పేట టీడీపీ ప్రజాగళం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీని ఓడించేందుకు యువత సిద్ధంగా ఉందన్నారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట అని చంద్రబాబు దుయ్యబట్టారు.
‘ఎక్కిడికి వెళ్లినా రైతుల బాధలు చూస్తున్నా. జగన్ ఒక్క ఛాన్స్ అన్నాడు. ముద్దులు పెట్టాడు. తలలు నిమిరాడు. అధికారంలోకి వచ్చాక బాదుడే.. బాదుడు. ప్రస్తుతం రైతులు, యువత, మహిళలను చూస్తుంటే.. ఫ్యాన్ ను చిత్తు చేసి డస్ట్ బిన్ లో పడేసేలా ఉన్నారు. జగన్ పది రూపాయలు ఇస్తే.. వంద దోచుకుంటాడు. ఈ ముఖ్యమంత్రి అహంకారు. మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆయన ఆశ. శిశుపాలుడు వంద పాపాలు చేస్తే.. జగన్ వెయ్యి పాపాలు చేశాడు. అలాంటి వ్యక్తిని క్షమించకూడదు.
- Advertisement -
వాలంటీర్లు తటస్థంగా ఉండండి. జనానికి అందుబాటులో ఉండండి. మేం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తీసేసే ప్రసక్తే లేదు. ఎవర్ని అడిగి లక్షల కోట్ల అప్పులు చేశావు? మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తోంది. చివరకు ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్, ఆస్పత్రులను కూడా తాకట్టు పెట్టాడు. ఇక తాకట్టుకు మిగిలింది జనం ఆస్తులే. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలుగుతాం. టీడీపీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది’ అని చంద్రబాబు అన్నారు.
- Advertisement -