E-Paper
Advertisement

సీఎం చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్స్.. వైసీపీని టార్గెట్ చేస్తూ, బోథ్ ఆర్ నాట్ సేమ్

సీఎం చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్స్.. వైసీపీని టార్గెట్ చేస్తూ, బోథ్ ఆర్ నాట్ సేమ్
Advertisement

TDP Mahanadu: సీఎం చంద్రబాబు రూటు మార్చారా? ఏ సభలు జరిగినా సినిమా డైలాగ్స్‌తో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారా? మొన్న పవన్ కల్యాణ్, ప్రభాస్ డైలాగ్స్ కాగా, ఇప్పుడు బాలకృష్ణ సినిమా డైలాగ్స్ వంతైంది. ఇంతకీ సీఎం చంద్రబాబు ఏమన్నారు? ఎవర్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

సీఎం చంద్రబాబు నోట బాలయ్య డైలాగ్స్

Advertisement

బుధవారం మంగళగిరి టీడీపీ ఆఫీసులోని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని, వీటిని ఆదిలోనే అడ్డుకోవాలని పిలుపు ఇచ్చారు. మహానాడు అనే పసుపు పండుగ ఉత్సాహాన్ని డైవర్ట్ చేయాలని ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నారని, వారెన్ని కుయుక్తులు పన్నినా డైవర్ట్ చేయలేరని తేల్చేశారు.

ఇది క్రూయల్ మెంటాలిటీ-నేరచరిత్రకు ఉదాహరణగా  ప్రస్తావించారు ముఖ్యమంత్రి.  గొడ్డలి పార్టీతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వాళ్ల నైజం ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలన్నారు. పేదలకు పథకాలు, యువతకు ఉద్యోగాలు కావాలన్నారు. గొడ్డలి వేటు కాదని, జంతు బలులతో రక్తాభిషేకాలు కావన్నారు.

Advertisement

మహానాడులో వైసీపీని ఏకి పారేసిన సీఎం చంద్రబాబు

రక్త చరిత్ర రాసేవాళ్లు.. స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరని తేల్చేశారు. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ల విధానమని, ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానమన్నారు. ఈ రెండూ బోథ్ ఆర్ నాట్ సేమ్ అంటూ బాలకృష్ణ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేశారు ముఖ్యమంత్రి.

టీడీపీ అనేది నాయకులను తయారు చేసే యూనివర్సిటీ అని అన్నారు.ఇక్కడ చదివిన వారే వేరే ప్రాంతాల్లో, వేరే పార్టీల్లో రాణిస్తున్నారు తప్ప మరొకటి కాదన్నారు. సోషల్ రీ ఇంజనీరింగ్ ద్వారా అనేది అందరికీ న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతంగా చెప్పారు.  ఇలా సీఎం చంద్రబాబు సినిమా డైలాగ్స్ గతంలో కూడా చెప్పారు. పోయినవారం నెల్లూరు జిల్లాలో ఓ సభలో పవన్ కల్యాణ్, ప్రభాస్ డైలాగ్స్‌ చెప్పిన విషయం తెల్సిందే.

ALSO READ: పుష్కర కాలం తర్వాత మౌనం వీడాను.. మీ గురించి చిట్టా విప్పితే, తట్టుకోలేరన్న పవన్ 

 

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×