E-Paper
Advertisement

నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!
Advertisement

Vikram-1 Launch: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చరిత్రలో ఈరోజు ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ స్వయంగా రూపొందించిన ‘విక్రమ్-1’ రాకెట్ మరికొద్ది సేపట్లో నింగిలోకి దూసుకెళ్లింది.

కౌంట్‌డౌన్ ప్రారంభం.. ప్రయోగానికి సర్వం సిద్ధం

Advertisement

‘ది మిషన్ ఆగమన్’ అనే పేరుతో చేపడుతున్న ఈ చారిత్రాత్మక ప్రయోగానికి శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపారు. ఇందుకోసం ఉదయం 6 గంటలకే కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపంతో 4.59 నిమిషాల ముందు కౌంట్ డౌన్ ఆగిపోవడంతో తిరిగి కౌంట్ డౌన్ ప్రారంభించారు.  తిరిగి ఈ ప్రయోగాన్ని 12: 05 గంటలకి శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే రాకెట్ నింగి వైపు ప్రయాణించింది.

రాకెట్ సామర్థ్యం.. ప్రత్యేక పేలోడ్స్ ఇవే!

Advertisement

సుమారు 350 కేజీల బరువున్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO) లోకి తీసుకెళ్లేలా ఈ విక్రమ్-1 రాకెట్‌ను డిజైన్ చేశారు. ఈ రాకెట్ ద్వారా ‘మిషన్ ఎంబ్రేస్’ (స్కోప్) అనే ప్రత్యేక పేలోడ్‌తో పాటు మరో మూడు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. కాస్మోస్ స్పేస్ సంస్థ సాంకేతికతతో రూపొందించిన ఈ పేలోడ్, అంతరిక్షంలో ప్రమాదకరంగా మారిన వ్యర్థాలను, పనిచేయని పాత ఉపగ్రహాలను గుర్తించి, సురక్షితంగా కక్ష్య నుంచి తొలగించేందుకు ఉపయోగపడుతుంది.

ప్రయోగాన్ని వీక్షించనున్న మంత్రి నారా లోకేష్

ఈ అద్భుత ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ శ్రీహరికోటకు చేరుకున్నారు. ఉదయం 10:20 గంటలకే షార్‌లోని వీవీఐపీ గ్యాలరీకి చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు, ఇస్రో శాస్త్రవేత్తలు ఘన స్వాగతం పలికారు.

2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇవ్వడంతో భారతీయ స్టార్టప్‌లు సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్నాయి. ఇస్రో సహకారంతో హైదరాబాద్ కి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ సొంతంగా రాకెట్‌ను తయారు చేసి కక్ష్యలోకి పంపుతుండటం నిజంగా భారతీయులందరూ గర్వించదగ్గ విషయం.

Related News

గుంటూరు దారుణం.. మహిళపై హిజ్రాలతో దాడి.. టీడీపీ నేత సస్పెండ్, ప్రభుత్వం సీరియస్!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

విజయవాడకు రిలీఫ్.. ఇక రాయనపాడు రైల్వేస్టేషన్ వంతు, జర్నీ మరింత వేగవంతం

అప్పుడు ఓ అడుగు వెనక్కి తగ్గాం.. ఇప్పుడు తగ్గేదిలేదు-మంత్రి నాదెండ్ల

శవానికి తాళి కట్టు.. ప్రియుడిపై చనిపోయిన యువతి బంధువులు ఒత్తిడి, అసలేం జరిగిందంటే?

రైలు ప్రయాణికులకు అలర్ట్.. కాకినాడ జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిపివేత

Big Stories

Advertisement
×