E-Paper
Advertisement

AP CM CHANDRABABU : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్

AP CM CHANDRABABU : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
Advertisement

AP CM CHANDRABABU : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో ఏదో జరుగుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మందలించారు. ఇసుక మద్యం వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి…

Advertisement

ఇసుక ఉచితంగా ఇస్తున్నా, అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఏ స్థాయిలో తప్పులు జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. కూటమి సర్కారు ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వచ్చే పది రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో మార్పు రాకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. రాష్ట్రంలో ఇసుక సామాన్యులకు విరివిగా దొరకాలన్న సీఎం, అన్ని బంధనాలు తొలగించి, రవాణా, తవ్వకం ఛార్జీలు సైతం తక్కువ ధరలో అందుబాటులో ఉండాలన్నారు.

ఫ్రీగా అందించాలి…

Advertisement

మీరంతా ప్రజాప్రతినిధులుగా  చర్యలు తీసుకుంటూ ఉచిత ఇసుకను ప్రజలందరికీ అందించి తీరాలని అల్టిమేటం జారీ చేశారు. ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే ఎలాంటి ఫీజులు, ఛార్జీలు వసూలు చేయకూడదని సీఎం స్పష్టంగా చెప్పేశారు.

మంత్రులే బాధ్యతలు తీసుకోవాలి…

ఇక ఇసుక రవాణాలో అక్రమాలు లేకుండా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే బాధ్యతలు తీసుకుని అంతా సజావుగా నడిపించాలని సూచనలు చేశారు. ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నట్లు కొందరు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలతో ఇబ్బందులు కలిగాయన్న సీఎం, ఇకపై వేధింపులు లేకుండా చూడాలన్నారు.

Also read : హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×