E-Paper
Advertisement

AP CM CHANDRABABU : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్

AP CM CHANDRABABU : 10 రోజుల్లో మార్పు రాకుంటే అంతే, ఉచిత ఇసుకపై మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
Advertisement

AP CM CHANDRABABU : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనలో ఏదో జరుగుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మందలించారు. ఇసుక మద్యం వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలి…

Advertisement

ఇసుక ఉచితంగా ఇస్తున్నా, అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఏ స్థాయిలో తప్పులు జరిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. కూటమి సర్కారు ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వచ్చే పది రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలిలో మార్పు రాకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. రాష్ట్రంలో ఇసుక సామాన్యులకు విరివిగా దొరకాలన్న సీఎం, అన్ని బంధనాలు తొలగించి, రవాణా, తవ్వకం ఛార్జీలు సైతం తక్కువ ధరలో అందుబాటులో ఉండాలన్నారు.

ఫ్రీగా అందించాలి…

Advertisement

మీరంతా ప్రజాప్రతినిధులుగా  చర్యలు తీసుకుంటూ ఉచిత ఇసుకను ప్రజలందరికీ అందించి తీరాలని అల్టిమేటం జారీ చేశారు. ఇసుక తవ్వుకుని తీసుకెళ్తే ఎలాంటి ఫీజులు, ఛార్జీలు వసూలు చేయకూడదని సీఎం స్పష్టంగా చెప్పేశారు.

మంత్రులే బాధ్యతలు తీసుకోవాలి…

ఇక ఇసుక రవాణాలో అక్రమాలు లేకుండా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే బాధ్యతలు తీసుకుని అంతా సజావుగా నడిపించాలని సూచనలు చేశారు. ఆంక్షల పేరుతో అధికారులు వేధిస్తున్నట్లు కొందరు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వర్షాలతో ఇబ్బందులు కలిగాయన్న సీఎం, ఇకపై వేధింపులు లేకుండా చూడాలన్నారు.

Also read : హైదరాబాద్ విస్తరణ ప్రణాళికాబద్ధమే – డిప్యూటీ సీఎం భట్టీ

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×