E-Paper
Advertisement

CM Jagan : విశాఖ నుంచి పాలన పక్కా.. ఎప్పటినుంచంటే?.. సీఎం జగన్ క్లారిటీ..

CM Jagan : విశాఖ నుంచి పాలన పక్కా.. ఎప్పటినుంచంటే?.. సీఎం జగన్ క్లారిటీ..
Advertisement

CM Jagan : విశాఖపట్నం నుంచే పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తొలుత ఉగాది నుంచి వైజాగ్ కు షిప్ట్ అవ్వాలని భావించారు. అయితే అమరావతిపై పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 28న విచారణ చేపట్టనుంది. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదు. ఇప్పటికే ఈ విషయంపై టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. మరి ఏపీ ప్రభత్వం వెనక్కి తగ్గిందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ ఇష్యూ జనంలోకి వెళ్లకముందే గంటల వ్యవధిలోనే సీఎం జగన్ రాజధాని తరలింపుపై మరోసారి క్లారిటీ ఇచ్చేశారు.

అసెంబ్లీ బడ్జెట్‌ సమాశాల నేపథ్యంలో జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. జూలైలో విశాఖపట్నానికి వెళ్తున్నామని మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో వైజాగ్ నుంచి ప్రభుత్వ పాలనకు దాదాపుగా ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది.

Advertisement

విశాఖ పాలనా రాజధాని అని గతంలో సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తామని ఢిల్లీలోనే ప్రకటించారు. దీంతో ఎప్పటి నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారనే ఆసక్తి నెలకొంది. విశాఖ కేంద్రం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో విశాఖ రాజధాని అని అటు సీఎం జగన్, ఇటు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుకోసమే ప్రభుత్వం వేచిచూస్తోంది. తీర్పురాగానే అధికారికంగా రాజధాని తరలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×