E-Paper
Advertisement

CM Jagan : కాంగ్రెస్ డర్టీ గేమ్.. కుటుంబం చీల్చి రాజకీయం..

CM Jagan : ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామన్నారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామన్నారు.

CM Jagan : కాంగ్రెస్ డర్టీ గేమ్.. కుటుంబం చీల్చి రాజకీయం..
Advertisement

CM Jagan : ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామన్నారు. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించామన్నారు.

మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చామని జగన్ తెలిపారు. ఈ అంశమే తమ ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనమన్నారు . కాంగ్రెస్‌ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్‌ ఆడుతోందని విమర్శించారు. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారన్నారు. అలాగే తన కుటుంబాన్ని కూడా విభజించారని మండిపడ్డారు.

Advertisement

కాంగ్రెస్‌ పార్టీ ఏపీల చెత్త రాజకీయం చేస్తోందని సీఎం జగన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ తన బాబాయ్‌ వివేకానందరెడ్డిని మంత్రిగా చేసి తమకు వ్యతిరేకంగా పోటీ చేయించారని గుర్తు చేశారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్‌.. మరోసారి తన సోదరి షర్మిలను ప్రయోగించిందని విమర్శించారు. కాంగ్రెస్ కు దేవుడు గుణపాఠం చెబుతాడని సీఎం జగన్‌ అన్నారు.

Related News

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×