BigTV English

List of AP Congress Candidates: 14 మందితో కాంగ్రెస్ మరో జాబితా.. పలు స్థానాలకు అభ్యర్థుల మార్పు..

List of AP Congress Candidates: 14 మందితో కాంగ్రెస్ మరో జాబితా.. పలు స్థానాలకు అభ్యర్థుల మార్పు..

Congress: రాష్ట్రంలో జరగబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం 14 మంది పేర్లతో కూడిన లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 3 ఎంపీ, 11 అసెంబ్లీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణగోపాల్ ప్రకటించారు. అయితే ఈ జాబితాలో పలు స్థానాలకు అధిష్ఠానం అభ్యర్థులను మార్చింది.


3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులు వీరే..
1.నర్సాపురం- కొర్లపాటి బ్రహ్మానంద రావ్ నాయుడు
2.రాజంపేట-ఎస్ కే బషీద్
3.చిత్తూరు(ఎస్సీ)- ఎం జగపతి

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా..
1.చీపురుపల్లి- ఆది నారాయణ జమ్ము
2.శృంగవరపు కోట- గేదెల తిరుపతి
3.విజయవాడ ఈస్ట్- పొనుగుపాటి నాంచారయ్య
4.తెనాలి- చందూ సాంబశివుడు
5.బాపట్ల- గంటా అంజిబాబు
6.సత్తెనపల్లి- చంద్రపాల్ చుక్కా
7.కొండపి(ఎస్సీ)- పసుమర్తి సుధాకర్
8.మార్కాపురం-షాహిద్ జావిద్ అన్వర్
9.కర్నూల్- షేక్ జిలానీ భాష
10.ఎమ్మిగనూరు- మరుమళ్ల ఖాసీం వలీ
11.మంత్రాలయం- పీ.ఎస్. మురళీ కృష్ణరాజు


అయితే వీటిలో పలు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను మార్చింది. చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని గతంలో తుమ్మగంటి సూరినాయుడికి కేటాయించగా.. ఈ జాబితాలో అతన్ని కాదని ఆదినారాయణ జమ్ముకు టికెట్ కేటాయించింది. విజయవాడ ఈస్ట్ స్థానాన్ని కూడా సుంకర పద్మశ్రీని కాదని.. పొనుగుపాటి నాంచారయ్యకు అధిష్ఠానం కేటాయించింది.

తెనాలి స్థానాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం గతంలో ఎస్ కే బషీద్ కు కేటాయించింది. అయితే ఈ జాబితాలో అతని స్థానంలో చందూ సాంబశివుడుకు అవకాశం కల్పించింది. కొండపి స్థానాన్ని శ్రీపతి సతీష్ ను కాదని.. పసుమర్తి సుధాకర్ పేరును ప్రకటించింది. మర్కాపుర స్థానానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిని మార్చింది. షేక్ సైదాను మార్చుతూ.. షాహిద్ జావిద్ అన్వర్ కు అవకాశం ఇచ్చింది. అయితే ఇటీవలే అధిష్ఠానం విడుదల చేసిన జాబితాలో కూడా పలు స్థానాలకు అభ్యర్థులను మార్చింది.

Tags

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×