E-Paper
Advertisement

Crime: పెళ్లైన మహిళతో ఎఫైర్.. అడ్డొచ్చిన తండ్రిపై దాడి.. వీడియో కాల్‌లో లవర్‌కు లైవ్..

Crime: పెళ్లైన మహిళతో ఎఫైర్.. అడ్డొచ్చిన తండ్రిపై దాడి.. వీడియో కాల్‌లో లవర్‌కు లైవ్..
Advertisement

Crime: జనాలు మరీ సైకోలుగా మారిపోతున్నారు. ఇటీవల కాలంలో ఉన్మాదం జడలు విచ్చుకుంటోంది. మహిళలపై దాడులు, గంజాయి గొడవలు, హత్యలు, అరాచకాలతో పైశాచికత్వం పేట్రేగిపోతోంది. అలాంటిదో మరో ఘటన చిత్తూరు నగరంలో జరిగింది.

అతని పేరు భరత్. వయసు 21. పనీపాటలేని జులాయి ఖర్చుల కోసం కూలి పని చేస్తుంటాడు. వాడికి కూడా ఓ ఎఫైర్ ఉంది. తమ ఇంటి సమీపంలోని ఓ మహిళ(39)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య సుమారు 20ఏళ్ల గ్యాప్ ఉంది. అయితేనేం.. ఆ యంగ్ బాయ్‌తో తెగ ఎంజాయ్ చేస్తోంది ఆ హౌజ్ వైఫ్.

Advertisement

ఈ అక్రమ సంబంధం విషయం భరత్ తండ్రికి తెలిసింది. అతనికి ఒళ్లు మండింది. తన కొడుకు చెడిపోతున్నాడని భావించి.. మందలించాడు. తండ్రి హోంగార్డుగా చేస్తుండటంతో పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు. కొడుకును స్టేషన్‌కు పిలిపించి ఎస్సైతో గట్టిగా వార్నింగ్ ఇప్పించాడు తండ్రి. ఇక తన కొడుకు దారికొస్తాడని.. ఆ మహిళతో ఎఫైర్ ఆపేస్తాడని భావించాడు.

కానీ, భరత్ తగ్గేదేలే అన్నాడు. అప్పటికే బాగా అలవాటు పడ్డాడేమో.. ఆ మహిళకు దూరంగా ఉండేది లేదన్నాడు. తనకే వార్నింగ్ ఇప్పిస్తాడా అని తండ్రిపైనే ధ్వేషం పెంచుకున్నాడు. వన్ ఫైన్ డే.. తన ఆంటీకి ఫోన్ చేసి.. వీడియో కాల్‌లో ఆమెకు చూపిస్తూ.. తండ్రిని దారుణంగా కొట్టాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో ఆ తండ్రికి తీవ్ర గాయమైంది. ఇదంతా వీడియో కాల్‌లో చూస్తూ ఆ మహిళ ఖుషీ అయింది.

Advertisement

విషయం తెలిసి స్థానికులు గాయపడిన తండ్రిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. భరత్‌పై చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×