BigTV English
Advertisement

Crime: పెళ్లైన మహిళతో ఎఫైర్.. అడ్డొచ్చిన తండ్రిపై దాడి.. వీడియో కాల్‌లో లవర్‌కు లైవ్..

Crime: పెళ్లైన మహిళతో ఎఫైర్.. అడ్డొచ్చిన తండ్రిపై దాడి.. వీడియో కాల్‌లో లవర్‌కు లైవ్..

Crime: జనాలు మరీ సైకోలుగా మారిపోతున్నారు. ఇటీవల కాలంలో ఉన్మాదం జడలు విచ్చుకుంటోంది. మహిళలపై దాడులు, గంజాయి గొడవలు, హత్యలు, అరాచకాలతో పైశాచికత్వం పేట్రేగిపోతోంది. అలాంటిదో మరో ఘటన చిత్తూరు నగరంలో జరిగింది.


అతని పేరు భరత్. వయసు 21. పనీపాటలేని జులాయి ఖర్చుల కోసం కూలి పని చేస్తుంటాడు. వాడికి కూడా ఓ ఎఫైర్ ఉంది. తమ ఇంటి సమీపంలోని ఓ మహిళ(39)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య సుమారు 20ఏళ్ల గ్యాప్ ఉంది. అయితేనేం.. ఆ యంగ్ బాయ్‌తో తెగ ఎంజాయ్ చేస్తోంది ఆ హౌజ్ వైఫ్.

ఈ అక్రమ సంబంధం విషయం భరత్ తండ్రికి తెలిసింది. అతనికి ఒళ్లు మండింది. తన కొడుకు చెడిపోతున్నాడని భావించి.. మందలించాడు. తండ్రి హోంగార్డుగా చేస్తుండటంతో పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశాడు. కొడుకును స్టేషన్‌కు పిలిపించి ఎస్సైతో గట్టిగా వార్నింగ్ ఇప్పించాడు తండ్రి. ఇక తన కొడుకు దారికొస్తాడని.. ఆ మహిళతో ఎఫైర్ ఆపేస్తాడని భావించాడు.


కానీ, భరత్ తగ్గేదేలే అన్నాడు. అప్పటికే బాగా అలవాటు పడ్డాడేమో.. ఆ మహిళకు దూరంగా ఉండేది లేదన్నాడు. తనకే వార్నింగ్ ఇప్పిస్తాడా అని తండ్రిపైనే ధ్వేషం పెంచుకున్నాడు. వన్ ఫైన్ డే.. తన ఆంటీకి ఫోన్ చేసి.. వీడియో కాల్‌లో ఆమెకు చూపిస్తూ.. తండ్రిని దారుణంగా కొట్టాడు. కర్రతో తలపై బలంగా కొట్టడంతో ఆ తండ్రికి తీవ్ర గాయమైంది. ఇదంతా వీడియో కాల్‌లో చూస్తూ ఆ మహిళ ఖుషీ అయింది.

విషయం తెలిసి స్థానికులు గాయపడిన తండ్రిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. భరత్‌పై చిత్తూరు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×