BigTV English

Cm jagan: సీఎం జగన్ కాన్వాయ్‌పై దాడి.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..

Cm jagan: పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ..సీఎం జగన్‌ కాన్వాయ్‌పై రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైసీపీ నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్‌ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 24న పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గోని సమీపంలోని హెలిప్యాడ్‌కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్‌పైకి గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కారుపై పడింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Cm jagan: సీఎం జగన్ కాన్వాయ్‌పై దాడి.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..
CM Jagan latest news

CM Jagan latest news(AP breaking news today):

పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి .. సీఎం జగన్‌ కాన్వాయ్‌పై రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైసీపీ నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా వెలుగులోకి వచ్చింది.


సీఎం జగన్‌ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 24న పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని సమీపంలోని హెలిప్యాడ్‌కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్‌పైకి గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కారుపై పడింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న తర్వాత రెండు రోజులపాటు అప్పయ్యని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. చివరకు వైసీపీ నేతలు ఈ విషయంపై జోక్యం చేసుకుని అప్పయ్యను విడిపించారు. దివ్యాంగుడైన అప్పయ్య పెన్షన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా పింఛను మంజూరు కాకపోవడంతో విసుగు చెంది సీఎం కాన్వాయ్‌పైకి రాయి విసిరినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది.


Tags

Related News

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

Big Stories

×