E-Paper
Advertisement

పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం

పెళ్లి వేడుకలో రక్తపాతం.. ఇద్దర్ని లేపేసిన ప్రత్యర్థులు, తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం
Advertisement

Tirupati Double Murder: తిరుపతి నగరంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. విడిపోయిన కుటుంబాన్ని కలపాలని భావించిన ఇద్దరు మధ్యవర్తులు దారుణ హత్యకు గురయ్యారు. తిరుపతిలోని పద్మావతి కల్యాణ మండపం-1లో రాత్రి ఈ ఘోరం జరిగింది. జంట హత్యల వెనుక అసలేం జరిగింది?

తిరుపతి సిటీలో జంట హత్యల కలకలం-తిరుమల వ్యాపారి సంపూర్ణమ్మ తన కూతుర్ని ఏర్పేడు మండలానికి చెందిన సునీల్ ఇచ్చి పెళ్లి చేసింది. ఇదంతా ఆరేళ్ల కిందట జరిగింది. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఫ్యామిలీలో ఏర్పడిన కొన్ని సమస్యల కారణంగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు.

Advertisement

బుధవారం రాత్రి తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో జంగాలపల్లి ప్రాంతానికి చెందిన వారి బంధువుల వివాహం జరుగుతోంది. ఈ వివాహానికి అల్లుడు సునీల్ వస్తాడని భావించింది అత్త సంపూర్ణమ్మ. పెద్దలతో మాట్లాడించి తన కూతురు సంసారాన్ని చక్కదిద్దాలని అనుకుంది.

పద్మావతి కళ్యాణ మండపంలో ఘటన-ఈ నేపథ్యంలో ఆనాడు పెళ్లి పెద్దగా వ్యవహారించిన మునిరత్నం యాదవ్‌ను సంప్రదించింది సంపూర్ణమ్మ. తిరుమలలో గాజుల వ్యాపారం చేస్తున్న మునిరత్నం, పెద్దామె మాట కాదనలేక సరేనని అన్నాడు. మునిరత్నం తన స్నేహితుడు మణికంఠను తోడుగా తీసుకుని వివాహ వేడుకకు వచ్చాడు.

Advertisement

కల్యాణ మండపంలో మునిరత్నం-మణికంఠ కలిసి సునీల్‌ను కలిశారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో మాటా మాటా కాస్త పెరిగి తీవ్ర వివాదానికి దారితీసింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీల్, ఫోన్ చేసి తన తండ్రి, తమ్ముడు, అల్లుడ్ని కల్యాణ మండపం వద్దకు రప్పించాడు.

భార్యాభర్తలను కలపేందుకు ప్లాన్..  ఆగ్రహానికి లోనైన యువకుడి బంధువులు

చర్చలు ఫెయిల్ కావడంతో మునిరత్నం-మణికంఠలు తమ వాహనాలపై వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. బయలుదేరుతున్న సమయంలో సునీల్-అతని కుటుంబ సభ్యులు కత్తులతో వారిపై విచక్షణా రహితంగా దాడికి చేశారు. ఈ పరిణామానికి భయపడిన బంధువులు, అక్కడున్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. కల్యాణ మండపం నుంచి బయటకు పరుగెత్తున్న వ్యక్తులను వెంటాడి మరీ నరికాడు సునీల్.

ALSO READ: మత విద్వేషాలు రేపితే చర్యలు తప్పవు.. జగన్, ప్రకాష్ రాజ్‌లపై మంత్రి సత్యకుమార్ ఫైర్!

తీవ్రంగా గాయపడిన మునిరత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాల పాలైన మణికంఠ ప్రాణాలను కాపాడుకోవడానికి కల్యాణ మండపం ప్రధాన గేటు వైపు పరుగులు తీశాడు. ఈ ఘటన గురించి సమాచారం తీసుకున్న స్థానికులు వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ కూడా మృతి చెందాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 

Related News

మత విద్వేషాలు రేపితే చర్యలు తప్పవు.. జగన్, ప్రకాష్ రాజ్‌లపై మంత్రి సత్యకుమార్ ఫైర్!

రేషన్ కార్డువారికి ఏపీలో శుభవార్త.. అందుబాటులోకి మీ మార్ట్‌లు, తక్కువ ధరకే సరుకులు, మరి డీ‌మార్ట్ మాటేంటి?

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే 1,126 రకాల ప్రభుత్వ సేవలు..!

నల్లమల అడవుల్లో సంచలనం.. గుండ్లకమ్మ తీరంలో బయటపడ్డ.. 1800 ఏళ్ల నాటి రహస్యాలు!

Prakash Raj: ప్రకాష్ రాజ్‌కు బిగ్ షాక్.. పోలీసులకు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదు..!

వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టింది అందుకే.. మంత్రి మండిపల్లి సంచలన వ్యాఖ్యలు!

South korea: హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ మద్దతు.. సౌత్ కొరియాలో బిజీగా మంత్రి లోకేష్

Big Stories

Advertisement
×