Prakash Raj: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు షాక్ తగిలింది. ఆయన కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో హిందూవులు, దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని అగ్రనేతలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్షి విష్ణువర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ హిందువుల దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక యాతవ్ హిందూ సమాజాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి పోలీసులకు తెలిపారు. హిందువుల మనోబావాలు దెబ్బతినేలా ప్రాకాష్ రాజ్ మాట్లాడుతున్నారని తెలిపారు.
Also read: Kavitha: మరోసారి బాయిబాట పట్టనున్న కల్వకుంట్ల కవిత.. నెక్ట్స్ టార్గెట్ ఈ నియోజక వర్గాలే..?
రోజు సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారని అన్నారు. దేశ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు తెలిపారు. దీంతో ప్రకాష్ రాజ్ పై చట్టప్రకారం దర్యాప్తు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటుగా వైసీపీ, సీపీఐ, సీపీఎం తమ వైఖరి మార్చుకోవాలని హిందువుల మనోబావాలు దెబ్బతినేలా ఎవరు మాట్లాడొద్దని విష్ణువర్ధన్ రెడ్డి సూచనలు చేశారు.