Amaravati: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఫోన్ చేసిన ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలని చెప్పినట్టు సమాచారం. ఈనెల 11న నోటీసులు ఇచ్చామని చెప్పారట. తనకు నోటీసులు అందలేదని ఆయన తెలిపారు. తాజాగా తమ కార్యాలయానికి రావాలని అధికారులు చెప్పారు. నోటీసులు ఏ కేసులో ఇచ్చారో సమాచారం తెలియదని చెప్పారట అంబటి.
ఏపీ లిక్కర్ స్కామ్లో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. ఈ కేసులో వైసీపీ కీలక నేతలకు చెమటలు పడుతున్నాయి. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మద్య అక్రమ రవాణా వ్యవహారంలో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఈ వ్యవహారంలో అంబటికి నోటీసులు ఇవ్వడంతో వైసీపీ నేతలు ఖంగుతిన్నారు. మద్యం రవాణాకు సంబంధించి సబ్ కాంట్రాక్టులు అంబటి రాంబాబు బినామీ కంపెనీలకు కట్టబెట్టారని అధికారులు దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో అంబటికి ఈనెల 11 న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినట్టు ఈడీ మాట. తనకు ఎలాంటి సమాచారం లేదని, అందుకే విచారణకు రాలేదని ఆయన చెప్పినట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండువారాలు కిందట అంబటి అనారోగ్యం పాలైన అంబటి, చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ వైద్యం తీసుకుంటున్నారు. అందువల్ల నోటీసులు ఆయనకు అందలేదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఫోన్ చేసి ఈడీ కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో ఓ వైపు సిట్.. మరోవైపు ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఈడీ అరెస్టు చేయడం, రిమాండ్ విధించడం చకచకా జరిగింది. వైసీపీలో కీలకంగా ఉన్న అంబటికి నోటీసులు ఇవ్వడంతో మిగతా నేతలకు టెన్షన్ పట్టుకుంది. రేపటి రోజున ఇంకెంతమందికి నోటీసులు ఇస్తారేమోనని బెంబేలెత్తిత్తున్నారు. ఈడీ నోటీసులపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
ALSO READ: ట్రైన్పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్లో రచ్చ