Vizianagaram Crime: భర్తకు కటిఫ్ చెప్పింది. వరసకు బావ కొడుకుతో కాపురం పెట్టింది. వాడితోనైనా బుద్దిగా ఉందా అంటే అది లేదు. ఏకంగా వాడినే లేపేసి కిల్లర్ లవర్గా మారింది ఈ డేంజరస్ లేడీ డాన్.
సొంత బావ కొడుకుపై కన్ను..
మీరు చూస్తున్నది విజయనగరం జిల్లా కందిపేట. ఇక్కడో రిలేషన్షిప్ డ్రామా దారుణమైన కిల్లర్ స్టోరీగా టర్న్ తీసుకుంది. ధనాల రాములమ్మ అనే మహిళా మూర్తి.. భర్తను పక్కనబెట్టేసి జల్సాలకు అలవాటుపడింది. సరిగ్గా అదే టైమ్లో సొంత బావ కొడుకు ధనాల శ్రీనుపై కన్నుపడింది. వరసను పాతరవేసింది. బంధాలను బావిలో పడేసింది. వాడు అంటేనే ఇష్టమంటూ తెగేసి చెప్పింది. పక్కింటివాళ్లు ఛీ కొడుతున్నా.. ఇద్దరూ కలిసి ఒకే రూమ్లో సహజీవనం స్టార్ట్ చేశారు. భర్తను వదిలేసి వచ్చిన ఈ కేటుగాత్తెని నమ్మి ఆ శ్రీనుగాడు కూడా లవ్ గేమ్లోకి ఎంటర్ అయ్యాడు. బాబాయ్ భార్య అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ వెర్రి వెధవకు.
ఇద్దరి మధ్య రియల్ ఫైట్..
ఈ ప్రేమ పిచ్చి కాకుల కథ మొన్నటి వరకు బాగానే సాగింది. కానీ నిన్న రాత్రి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఏ విషయంలో తేడా వచ్చిందో ఏమో గానీ.. ఇద్దరి మధ్య రియల్ ఫైట్ స్టార్ట్ అయింది. మాటమాట పెరిగి హీటెడ్ ఆర్గ్యూమెంట్ నడిచింది. అంతే ఆ రాములమ్మలో దాగున్న సైకో క్రూర మృగం బయటికొచ్చింది. కోపంతో ఊగిపోతూ, పక్కనే ఉన్న ఐరన్ రాడ్ను చేతిలోకి తీసుకుంది. ప్రేమించినవాడని కనికరం లేకుండా… శ్రీను తలపై బలంగా కొట్టింది. రాములమ్మ దెబ్బకు శ్రీను గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు.
కేసు నమోదు..
విషయం తెలిసి చుట్టుపక్కల జనాలు షాక్ తిన్నారు. ఇంత కసితో సొంత మనిషినే హత్య చేస్తుందా ఈ బ్లడీ డెవిల్? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కి రీచ్ అయ్యారు. కందిపేటలో డెడ్బాడీని పోస్ట్మార్టంకి తరలించి, కేస్ బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ప్రియుడిని రాడ్తో బాది లేపేసిన ఈ లేడీ విలన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వరుసలు మరిచి… ఒళ్లు తిమ్మిరెక్కి చేసిన ఈ లవ్ ఎఫైర్ చివరకు మర్డర్ కేస్తో జైలు తలుపులు తట్టింది.
Also Read: రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్