E-Paper
Advertisement

రూ. 3 వేల కోట్ల స్కామ్.. ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. షాకైన విశాఖ వైసీపీ నేత విజయప్రసాద్‌

రూ. 3 వేల కోట్ల స్కామ్.. ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. షాకైన విశాఖ వైసీపీ నేత విజయప్రసాద్‌
Advertisement

Visakhapatnam: ఈడీ దాడులతో వైసీపీ నేత మళ్ల విజయ ప్రసాద్ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆయన ఇళ్లు- ఆఫీసులను ఏకకాలంలో సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణల్లోని ఐదు చోట్లు సోదాలు జరుగుతున్నాయి. వెల్ఫేర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల ఛైర్మన్‌గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయి.

విశాఖ వైసీపీ నేత విజయ్ ప్రసాద్ ఇంటిపై  ఈడీ సోదాలు

బుధవారం ఉదయం విశాఖ వైసీపీ పశ్చిమ నియోజకవర్గం నేత మళ్ల విజయప్రసాద్‌ ఇళ్లు-ఆఫీసుల్లో సోదాలు చేసింది ఈడీ. హైదరాబాద్‌, విశాఖలోని ఐదు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. వెల్ఫేర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల ఛైర్మన్‌ వ్యవహరించిన ఆయన, అనేక అవకతవకలకు పాల్పడిన కేసులో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.3 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఐదు ప్రాంతాల్లో ఇళ్లు-ఆఫీసుల్లో ఈడీ సోదాలు

Advertisement

బీహార్‌, ఒడిషాకు చెందిన ఈడీ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్ ఉన్నప్పుడు డిపాజిట్ల సేకరణ, నిధుల మళ్లింపులో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీ వెలుపల ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగించింది. ఆ సమయంలో ఆయన అనేక అవకతవకలకు పాల్పడినట్టు ఆయా రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల ఆధారంగా ఈడీ సోదాలకు దిగింది.

ALSO READ: వైసీపీలో అంతర్గత విభేదాలా? బోరుగడ్డ ఫోన్ సంభాషణ ఆడియో లీక్, వెలుగులోకి కొత్త విషయాలు

Advertisement

గతంలో ఒకసారి విజయ్‌ ప్రసాద్ ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు జరిగిన విషయం తెల్సిందే. ఈ తనిఖీల్లో భాగంగా ప్రసాద్ బ్యాంక్ ఖాతాలు, ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను ఈడీ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మళ్ల విజయప్రసాద్, 2019 ఎన్నికల్లో విశాఖపట్నం వెస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2021లో ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Related News

‘అబద్దాన్ని మీకన్నా ఎవరూ బాగా చెప్పలేరు’.. చంద్రబాబుపై షర్మిల సెటైర్లు!

ప్రకాష్ రాజ్ పళ్లు రాలగొడతాం.. సైబర్ డీజీకి బీజేపీ నేతలు ఫిర్యాదు

వైసీపీలో అంతర్గత విభేదాలా? బోరుగడ్డ ఫోన్ సంభాషణ ఆడియో లీక్, వెలుగులోకి కొత్త విషయాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం..ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు, హైదరాబాద్‌లో కూడా

వైఎస్ జగన్ వేసిన పునాదిపై టీడీపీ గొప్పలా.. మంత్రి గురుమూర్తి ఫైర్!

ఢిల్లీ పార్లమెంట్‌లో భోగాపురం రచ్చ.. సీఎం చంద్రబాబుకు మంత్రి తనూజ రాణి సవాల్!

ప్రకాశం జిల్లాలో దారుణం.. బల్లులు పడిన జావ తాగిన విద్యార్థులు

Big Stories

Advertisement
×