E-Paper
Advertisement

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!
Advertisement

Anakapalli Love: అసలు ఈ లోకానికి ఏమైంది. ప్రేమకు కులం, ఆస్తులే కాదు వరుసలు కూడా అడ్డురావు అంటున్నారు. పాఠ్యా పుస్తకాలు చదవాల్సిన పసిహృదయాలు ప్రేమ పాఠాలు భట్టిపడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఇలాంటి రెండు ప్రేమ కథలు కన్నీళ్లను మిగిల్చివెళ్లాయి. పెద్దలు కాదన్నారని తనువులు త్యాగం చేసి ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.

ఈ పిచ్చి ప్రేమలు మానుకోండి అంటూ వార్నింగ్..

Advertisement

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దమదినకు చెందిన ఇంటర్ విద్యార్థిని, హోటల్‌లో పనిచేసే కనకరాజు గాఢంగా ప్రేమించుకున్నారు. తీరా ఆరా తీస్తే ఆ ఇద్దరూ దూరపు చుట్టాలట. వరుసకు అన్నాచెల్లెళ్లు.. దీంతో పెద్దలు తీవ్రంగా మందలించారు. ఈ బంధం కుదరదు.. ఈ పిచ్చి ప్రేమలు మానుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ యువతీయువకులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ప్రేమించిన వాళ్లతో కలిసి బతకలేమనే భయమో, లేక సమాజం ఏమనుకుంటుందనే బెంగో కానీ.. క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకుని ప్రాణాలు వదిలేశారు.

Also Read: ఇంట్లోనే 30 ఏళ్లుగా పెరుగుతున్న పుట్ట.. భయంతో వణుకుతున్న వృద్ధురాలు!

Advertisement

మరో దారుణం వెలుగులోకి ..

ఈ గుండె కోత మరవకముందే.. పక్కనే ఉన్న కే. కోటపాడు మండలం కింతాడలో మరో దారుణం వెలుగు చూసింది. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్న మరో మైనర్ ప్రేమజంట చావు నీడను ఆశ్రయించింది. ఇద్దరూ మైనర్లు కావడంతో ప్రేమగీమా జాన్తా నహీ ముందు బాగా చదువుకోండి అంటూ పెద్దలు తిట్టిపంపించారు. తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదన్న బాధ ఆ పసిమనసులను కుంగదీసింది. ఇక బతకలేమన్న నిరాశతో ఆ మైనర్ జంట నేరుగా వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే చావుకు ముందు ఆ బాలుడు తన తండ్రికి ఫోన్ చేసి.. నాన్న మేము వెళ్లిపోతున్నామంటూ ఏడుస్తూ..ఇన్‌ఫర్‌మేషన్ ఇచ్చాడు. ఆ మాట విన్న తండ్రి గుండె పగిలిపోయి అక్కడికి పరుగెత్తుకు వచ్చేసరికి.. జరగరాని అనర్థం జరిగిపోయింది. ఈ రెండు ఘటనల్లో ఒకరిది పిచ్చితనం.. మరొకరిది పసితనం. బోలెడంత భవిష్యత్‌ను కళ్లముందు ప్రేమ కోసం కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చివెళ్లారు.

Tags

Related News

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×