E-Paper
Advertisement

Neeraja Reddy: మాజీ ఎమ్మెల్యే మృతి.. మరీ ఇంత బ్యాడ్‌లక్కా?

Neeraja Reddy: మాజీ ఎమ్మెల్యే మృతి.. మరీ ఇంత బ్యాడ్‌లక్కా?
Advertisement
Neeraja-reddy

Neeraja Reddy: పాటిల్ శేషిరెడ్డి. పత్తికొండ ఎమ్మెల్యే. ఫ్యాక్షన్ గొడవల్లో ప్రత్యర్థుల చేతిలో చనిపోయారు. భర్త పోయాక.. భార్య నీరజారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఓసారి ఎమ్మెల్యేగా కూడా అయ్యారు. ఇప్పుడు విధి ఆడిన నాటకానికి బలైపోయారు.

ఆ కుటుంబాన్ని ఏదో శాపం వెంటాడుతున్నట్టుంది. భర్త అలా.. భార్య ఇలా.. చనిపోవడం బాధాకరం. కర్నూల్‌ నుంచి హైదరాబాద్ వస్తున్నారు పాటిల్ నీరజారెడ్డి. అంతలోనే ఢాం అంటూ పెద్ద శబ్దం. కారు వెనుక టైరు పగిలిపోయింది. వేగంగా వెళ్తున్న వాహనం పల్టీలు కొట్టింది. కారులో ఉన్న నీరజారెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుప్రతిలో చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయారు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి. గద్వాల్ జిల్లా బీచుపల్లి దగ్గర జరిగిందీ ప్రమాదం. కారు టైరు పగిలి చనిపోవడం బ్యాడ్‌లక్ కాక మరేంటి!

Advertisement

భర్త మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు నీరజారెడ్డి. 2004లో పత్తికొండ నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి ఎస్వీ సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో ఆలూరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు నీరజారెడ్డి.

ఉన్నత విద్యావంతురాలైన నీరజారెడ్డి ఇప్పుడిప్పుడే బీజేపీలో యాక్టివ్ అవుతున్నారు. బళ్లారిలో నివాసం ఉంటూ తరుచూ ఆలూరు వచ్చివెళ్తుంటారు. రెగ్యులర్‌గా ప్రయాణాలు చేసే ఆమెను.. అదే ప్రయాణం కబళించడం శోచనీయం.

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×