BigTV English

Anathapuram News: ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై దాడి.. వైసీపీ నేతల వీరంగం.. అర్థరాత్రి హంగామా..

Anathapuram News: ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై దాడి.. వైసీపీ నేతల వీరంగం.. అర్థరాత్రి హంగామా..


Anathapuram News : అనంతపురం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది. స్థానిక వైసీపీ కార్పొరేటర్, అనుచరులు ఈ దాడి చేశారు. తమ వాడిని పట్టుకొస్తారా అంటూ నానా గొడవ చేశారు. సెబ్ పోలీసులతో అసహ్యంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారు.

అక్రమంగా మద్యం అమ్ముతుండగా నవోదయా కాలనీలో గుజ్జల సురేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసులు నమోదు చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై దాడికి ప్రయత్నించారు. ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.


మద్యం అమ్ముతున్న యువకుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంలోనే వైసీపీ నేతలు బీభత్సం సృష్టించారు. ఎస్సై మునిస్వామి, కోర్టు కానిస్టేబుల్ శేఖర్, మహిళా కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో హంగామా చేశారు. మహిళా కానిస్టేబుల్‌తోనూ దురుసుగా ప్రవర్తించారు. దాడి చేసింది అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు సైలెంట్‌గా ఉండిపోయారు.

Related News

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

Big Stories

×