BigTV English

Fighting between Ysrcp vs Tdp cadre: కుప్పంలో దాడులు, పోలీసుల మొహరింపు, ఏం జరుగుతుందోనని..

Fighting between Ysrcp vs Tdp cadre: కుప్పంలో దాడులు, పోలీసుల మొహరింపు, ఏం జరుగుతుందోనని..

Fighting between Ysrcp vs Tdp cadre: ఆంధ్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ క్లైమాక్స్‌కు చేరడంతో దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ-విపక్ష టీడీపీ కేడర్ మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. సాయంత్రం పడగానే ఎవరి వ్యూహాల్లో వాళ్లు నిమగ్నమవుతున్నారు. ఎప్పుడు, ఏ రూపంలో దాడులకు దిగుతున్నారో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.


ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం గురించి అందరికీ తెల్సిందే. గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాక ఆ పార్టీ కేడర్ ఫుల్‌జోష్‌లో ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కచ్చితంగా ఓడించాలని ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను రచించింది. వైసీపీ ప్లాన్‌ను ముందే పసిగట్టిన తెలుగుదేశం క్యాడర్, నిత్యం అలర్ట్‌గా ఉంది.

కుప్పం మున్సిపాలిటీ పరిధి లక్ష్మిపురంలో టీడీపీ- వైసీపీ కార్యకర్తలు రాత్రి బాహాబాహికి దిగారు. ఎన్నికల ప్రచారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పలువురికి గాయపడగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన 25వార్డు కౌన్సిలర్ మణి‌తోపాటు, పలువురిని ఈఎస్ మెడికల్ కాలేజీ‌కు తరలించారు.


ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి భరత్, బాధితులను పరామర్శించారు. దీంతో కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కుప్పంలో గెలవలేక పార్టీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. లక్ష్మిపురంలో భారీగా పోలీసులు మోహరించారు. అత్యంత సమస్యాత్మక, సున్నితమైన నియోజకవర్గాల్లో కుప్పం ఒకటి.

ALSO READ: ఎంత ఖర్చైనా.. ఊరెళిపోదాం మామ.. ఓటేసేద్దాం మామ..

పరిస్థితి జఠిలంగా మారితే 144 సెక్షన్ అమలు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, కౌన్సిలర్ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు వైసీపీ నాయకులు. వీటిని కంట్రోల్ చేయలేక పోలీసులు నానాఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఫోర్స్‌ను అక్కడ రంగంలోకి దించింది ఎన్నికల సంఘం. పోలింగ్ ముగిసే వరకు పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చించుకోవడం అక్కడి ప్రజల వంతైంది.

 

Related News

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×