BigTV English
Advertisement

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Food Checking Labs in AP: గత వైసీపీ పాలనలో ఏపీలో ఆహార భద్రత, ప్రమాణాల విషయమై భారీగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఆహార భద్రత, ప్రమాణాల ర్యాంకును పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా ఆహార నాణ్యతను నిర్ధారించే ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం ఓ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది.


Also Read: ప్రధాని మోదీతో దీనిపైనే చర్చించా… ఆయన కూడా… : సీఎం చంద్రబాబు

కాగా, ఏపీలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం కూటమి ప్రభుత్వం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI)తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో ఆహారం కల్తీపై పరీక్షలు చేసి నిర్ధారించేందుకు ల్యాబ్ లు ఏర్పాటు చేసేందుకు ఫుడ్ చెకింగ్ సంస్థ ఒప్పందంలో భాగంగా అంగీకరించింది. ఢిల్లీలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందం ప్రకారం కర్నూలు, తిరుపతిలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం ప్రత్యేక ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నారు.


Also Read: తిరు వీధుల్లో భక్త ప్రవాహం.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

ఇదిలా ఉంటే.. గత వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే ఆహార భద్రత, ప్రమాణాల్లో ఏపీ ర్యాంక్ దిగజారిందింటూ కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ సర్కారు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఆహార భద్రత తనిఖీల కోసం స్పెషల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో తొలుత 5 ప్రాథమిక ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. వీటితోపాటు 15 మొబైల్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్న ల్యాబ్ కు ఒక్కోదానికి రూ. 21 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. అదేవిధంగా విశాఖలో కూడా మైక్రో బయాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×