Konijeti Rosaiah: తీవ్ర విషాదం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి (86) కన్నుమూత.. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్న ఆమె సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ అమీర్పేటలోని తన నివాసంలో శివలక్ష్మి గారు తుదిశ్వాస విడిచారు. 2021లో రోశయ్య గారు మరణించిన తర్వాత, ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అమీర్పేటలోనే నివసిస్తున్నారు.
శివలక్ష్మి గారు నిరాడంబరంకు నిలువుటద్దంగా ఉండేవారు. రోశయ్య గారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆమె వెన్నంటి ఉండి కుటుంబ బాధ్యతలను చూసుకున్నారు. ఆమె మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.
Also Read: రాయలసీమ నీటి కోసం సుప్రీం పోరు.. న్యాయ నిపుణులకు మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు!