kovvur: విజయవాడ వైపు వెళ్తున్న ఓ గూడ్స్ గోదావరి జిల్లాలో పట్టాలు తప్పింది. నాలుగో లైన్లో పట్టాలు తప్పడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేసింది రైల్వేశాఖ. సమీపంలోని రైల్వే స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. గూడ్స్ పట్టాలు తప్పిన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీని కారణంగా రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ వైపు ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు.. కోవ్వూరు స్టేషన్ వద్ద నాలుగో రైల్వే లైన్పై వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఫలితంగా కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటన తర్వాత పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన విషయం తెలియగానే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
పునరుద్ధరణ, ట్రాక్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టారు. రైలు పట్టాలు తప్పడానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఇటు తూర్పు గోదావరి.. అటు పశ్చిమ గోదావరిలో రైళ్ల ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నిడదవోలు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి. ఉన్నట్లుండి రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు షాకయ్యారు.
ALSO READ: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ సిటీలో చినుకులు..
ఈ ప్రమాదంతో గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో ఈ లైన్లో ప్రయాణించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైల్వే ట్రాక్లను పునరుద్దరించేందుకు ముమ్మరం చేశారు అధికారులు. రైళ్ల రాకపోకలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.