E-Paper
Advertisement

చికెన్ కోసం ఘోరం.. ఎక్కువ ముక్కలు తిన్నాడని.. స్నేహితుడి దారుణ హత్య!

చికెన్ కోసం ఘోరం.. ఎక్కువ ముక్కలు తిన్నాడని.. స్నేహితుడి దారుణ హత్య!
Advertisement

Chicken Fight: కూలి పనులు చేసుకుంటూ ఒకే గదిలో ఉండే ఇద్దరు స్నేహితుల మధ్య చికెన్ కూర చిచ్చుపెట్టింది. ఎక్కువ ముక్కలు తింటున్నాడనే కోపంతో మెుదలైన వివాదం ఒకరి హత్యకు దారి తీసింది. మరొకరిని జైలు పాలు చేసింది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ విచిత్ర ఘటన.. స్థానికంగానే కాకుండా సోషల్ మీడియా వేదికగా చర్చకు తావిచ్చింది.

వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్‌ జిల్లాకు చెందిన సీతారామ్, అరుణ్‌ అనే ఇద్దరు వ్యక్తులు బెళగావిలోని ఒక స్టీల్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరు మరో నలుగురు కార్మికులతో కలిసి స్థానిక షెడ్డులో నివాసముంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అందరూ కలిసి మద్యం తాగి, చికెన్ వండుకున్నారు. భోజనం చేస్తున్న సమయంలో ‘నువ్వు నాకంటే ఎక్కువ చికెన్ ముక్కలు తింటున్నావ్’ అని అరుణ్‌ను సీతారామ్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది.

క్షణికావేశంలో కత్తితో దాడి

Advertisement

ఆ సమయానికి ఇద్దరూ తీవ్ర మద్యం మత్తులో ఉండటంతో చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఆవేశంతో రగిలిపోయిన అరుణ్.. గదిలో ఉన్న కత్తితో సీతారామ్ ఛాతిపై బలంగా పొడిచాడు. అతడికి తీవ్ర రక్తస్రావం కావడంతో కంగారుపడిన అరుణ్.. తోటి కార్మికులతో కలిసి హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఘటనను కప్పిపుచ్చేందుకు అరుణ్ ఆస్పత్రిలో కొత్త డ్రామాకు తెరలేపాడు. బిల్డింగ్ పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడని వైద్యులకు, పోలీసులకు అబద్ధం చెప్పాడు.

పోలీసుల దర్యాప్తులో అసలు నిజం..

మరోవైపు తీవ్రంగా గాయపడిన సీతారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో అరుణ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. మద్యం మత్తులో చికెన్ ముక్కల కోసం గొడవపడి పొడిచినట్లు నిందితుడు అంగీకరించాడు.

Advertisement

Also Read: వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

జిల్లా ఎస్పీ ఏమన్నారంటే?

ఈ ఘటనపై బెళగావి ఎస్పీ కె. రామరాజన్ స్పందిస్తూ.. ‘ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించి నిందితుడు దాచాలని చూశాడు. కానీ లోతుగా విచారణ జరిపిన తర్వాత ఇది పక్కా ప్రణాళిక లేకపోయినా క్షణికావేశంలో జరిగిన హత్య అని తేలింది’ అని ఎస్పీ వెల్లడించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అరుణ్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 15 కేజీ బంగారంతో చిక్కిన మహిళ, మాఫియాతో లింకులు.. సరిహద్దులో పసిడి పంట

Tags

Related News

15 కేజీ బంగారంతో చిక్కిన మహిళ, మాఫియాతో లింకులు.. సరిహద్దులో పసిడి పంట

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, 47 కిలోమీటర్లు రోడ్డుపై తిప్పుతూ

ఇస్రోలో ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్.. సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల ఖాళీలు.. పూర్తి వివరాలివిగో

ఇంగువలో నాణ్యతా లోపాలు.. ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ ఉత్పత్తులపై FSSAI నిషేధం!

నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. మమతా బెనర్జీపై కేసు నమోదు

Big Stories

Advertisement
×