E-Paper
Advertisement

CM jagan : త్వరలోనే విశాఖకు షిఫ్టింగ్.. క్లారిటీ ఇచ్చేసిన జగన్

CM jagan : త్వరలోనే విశాఖకు షిఫ్టింగ్.. క్లారిటీ ఇచ్చేసిన జగన్

CM jagan : త్వరలోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని, ఏపీ పరిపాలనా విభాగమంతా విశాఖకు మారుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ లోగానే విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు మరోసారి జగన్ స్పష్టం చేశారు. విశాఖ నుంచే రాష్ట్ర పాలన జరుగుతుందని జగన్ వెల్లడించారు. సోమవారం విశాఖ రిషికొండలో ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. విశాఖ త్వరలోనే ఐటీ హబ్ గా మారుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖపట్నమని.. ఐటీ పరంగా ఇది హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా అభివృద్ధి చెందుతుందన్నారు.

వైజాగ్ లో ఉద్యోగులకు, కంపెనీలకు విస్తారమైన అవకాశాలున్నాయన్న జగన్.. ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కల్పిస్తానని కంపెనీలకు హామీఇచ్చారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయని, ప్రతి ఏటా 15 వేల మంది ఇంజినీర్లు తయారవుతున్నారని తెలిపారు.ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్ హబ్ గా తయారైందన్నారు. అనంతరం ఇన్ఫోసిస్ అధికారులు మాట్లాడుతూ.. ఏపీలో హైబ్రీడ్ వర్కింగ్ మోడల్ లో 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ఏపీలో ఐటీ నిపుణులకు కొదవలేదని వారు అభిప్రాయపడ్డారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×